Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నమ్మి సహజీవనం చేసిన యువతి... 35 ముక్కలు చేసిన కిరాతక ప్రియుడు...

Advertiesment
murder
, సోమవారం, 14 నవంబరు 2022 (14:20 IST)
తనను నమ్మి సహజీవనం చేసేందుకు వచ్చిన ఓ యువతిని కిరాతక ప్రేమికుడు దారుణంగా హత్య చేశాడు. పైగా, ఆ యువతి శరీరాన్ని 35 ముక్కలు చేసి, 18 రోజుల పాటు రాత్రివేళ నిర్మానుష్య ప్రాంతంలో విసిరేసి మృతదేహం ఆనవాళ్లు లేకుండా చేశాడు. యువతి తండ్రి ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు అరెస్టు చేయగా, అసలు విషయం బయటకు వచ్చింది. ఈ దారుణం ఢిల్లీలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన అఫ్తాబ్ అమీన్ పునావాలా అనే వ్యక్తికి ఓ కాల్ సెంటరులో పని చేసే 26 యేళ్ళ శ్రద్ధా అనే యువతి పరిచయమైంది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి చివరకు సహజీవనానికి దారితీస్తుంది. వీరిద్దరి బంధాన్ని పెద్దలు అంగీకరించకపోవడంతో ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లి మెహ్‌రౌలీ అనే ప్రాంతంలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని నివసిస్తూ వచ్చారు. 
 
అయితే, వీరిద్దరి మధ్య పెళ్లి విషయంలో తరచుగా గొడవలు జరుగుతూ వచ్చాయి. ఆమెను పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని అమీన్.. శ్రద్ధను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని 35 ముక్కలు చేసి వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. 18 రోజుల పాటు అర్థరాత్రి 2 గంటలకు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాటిని విసిరేసి మృతదేహం జాడలేకుండా చేశాడు. 
 
అయితే, తన కుమార్తెకు ఫోన్ చేసినా ఎంతకీ తీయకపోవడంతో మృతురాలి తండ్రికి అనుమానం ఈ నెల 8వ తేదీన శ్రద్ధ, అమీన్ నివసిస్తూ వచ్చిన ఇంటికి వెళ్లి చూడగా అది తాళం వేసివుంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అమీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. అమీన్ ఇచ్చిన సమాచారంతో మృతదేహం ఆనవాళ్లకోసం గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న ట్విట్టర్