Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారులో జంట... మహిళను ఫాంహౌజ్‌కి తీస్కెళ్లి గ్యాంగ్ రేప్...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (16:10 IST)
పంజాబ్ లూథియానాలో శనివారం నాడు జరిగిన ఓ ఘటన పోలీసు వ్యవస్థ పనితీరుని ప్రశ్నించేలా చేసింది. శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఓ జంట కారులో వెళ్తుండగా గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు కారుపై రాళ్లు రువ్వి కారును ఆపారు. ఆపై వారిద్దరినీ అపహరించిన దుండగులు వారిని తీవ్రంగా కొట్టి, మహిళపై సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ముందుగా కారులో నుంచి జంటను బయటకు లాగి సమీపంలో ఉన్న ఫాంహౌజ్‌కి తీసుకెళ్లారు. కారులో ఉన్న వ్యక్తిని చితకబాది రూ.2 లక్షల రూపాయల ఇవ్వవలసిందిగా బెదిరించారు. వెంటనే ప్రాణాలను రక్షించుకునేందుకు స్నేహితునికి ఫోన్ చేసి డబ్బు తీసుకురమ్మని చెప్పాడు. బాధితుడి స్నేహితుడు నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఘటనపై పోలీసులకు సమాచారం అందించినా వారు ఎలాంటి చర్య తీసుకోలేదు. 
 
అయితే పోలీసులు ఘటనా స్థలికి చేరుకోకపోవడంలో నిందితులు మరో ఏడుగురిని అక్కడికి పిలిపించి మరీ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితులు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు గుర్తు తెలియని నిందితులపై కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అయితే విధి నిర్వహణలో పోలీసులు విఫలం కావడం వల్లే ఇలా జరిగిందని, వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సదరు బాధిత జంట పేర్కొంది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం