జార్ఖండ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ - ఐదుగురి మావోల హతం

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (09:45 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మావోలకు బుల్లెట్ గాయాలు తగలడంతో వారు గాయపడ్డారు. అలాగే సంఘటనా స్థలం నుంచి మావోల డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
జార్ఖండ్ రాష్ట్రంలోని పలాము - ఛాత్రా జిల్లాలోని సరిహద్దులో నక్సల్స్ దాగివున్నారన్న సమాచారంతో జార్ఖండ్ పోలీసులు, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్ఎపీఎఫ్) సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్టు ఛాత్రా ఎస్పీ రాకేశ్ రంజన్ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు చనిపోయారని, మరికొందరు బుల్లెట్ గాయాలైనట్టు పేర్కొన్నారు. 
 
ఘటనా స్థలం నుంచి ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అలాగే, భారీ మొత్తంలో ఆయుధాలతో పాటు ఇతర సామాగ్రిని చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారిలో రూ.25 లక్షల రివార్డు ఉన్న స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు గౌతమ్ పాశ్వాన్ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments