Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్నింగ్‌లో పేలిన కారు టైరు... ట్రక్కును ఢీకొని ఐదుగురి దుర్మరణం

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (17:25 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. ఓ కారు టైరు పేలిపోవడంతో అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఓ దర్గాలో ప్రార్థనలు చేసేందుకు బయలుదేరి మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాంనగర్‌కు చెందిన ఓ కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు కారులో బయలుదేరారు. మంగళవారం ఉదయం కారు అహ్లాద్‌పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది. దీంతో కారు నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వయసు 30 నుంచి 40 యేళ్ల మధ్యలో ఉంటాయని పోలీసులు తెలిపారు. మృతులను మొహ్మద్ తాహిర్, ఇమ్రాన్ ఖాన్, మొహ్మద్ ఫరీద్, మొహ్మద్ సాగిర్‌గా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments