Webdunia - Bharat's app for daily news and videos

Install App

రన్నింగ్‌లో పేలిన కారు టైరు... ట్రక్కును ఢీకొని ఐదుగురి దుర్మరణం

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (17:25 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. ఓ కారు టైరు పేలిపోవడంతో అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఓ దర్గాలో ప్రార్థనలు చేసేందుకు బయలుదేరి మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాంనగర్‌కు చెందిన ఓ కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు కారులో బయలుదేరారు. మంగళవారం ఉదయం కారు అహ్లాద్‌పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది. దీంతో కారు నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వయసు 30 నుంచి 40 యేళ్ల మధ్యలో ఉంటాయని పోలీసులు తెలిపారు. మృతులను మొహ్మద్ తాహిర్, ఇమ్రాన్ ఖాన్, మొహ్మద్ ఫరీద్, మొహ్మద్ సాగిర్‌గా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veera Dheera Sooran: చియాన్ విక్రమ్ వీర ధీర సూరన్ పార్ట్ 2 - మార్చి 27 గ్రాండ్ రిలీజ్

Janhvi Kapoor : RC16 లో టెర్రిఫిక్ రోల్ చేస్తున్న జాన్వి కపూర్ !

ఉపవాసం దీక్ష తో మూకుత్తి అమ్మన్ 2 చిత్ర పూజకు హాజరైన నయనతార

మ్యారేజ్ అంటే ఒప్పందం, సెటిల్మెంట్ కాదని చెప్పే చిత్రం మిస్టర్ రెడ్డి

Divya Bharathi: యాక్షన్ సీన్స్ చేయడం కష్టం, ఇలాంటి సినిమా మళ్ళీ రాదు : దివ్యభారతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments