రన్నింగ్‌లో పేలిన కారు టైరు... ట్రక్కును ఢీకొని ఐదుగురి దుర్మరణం

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (17:25 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన జరిగింది. ఓ కారు టైరు పేలిపోవడంతో అది అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వీరంతా ఓ దర్గాలో ప్రార్థనలు చేసేందుకు బయలుదేరి మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రాంనగర్‌కు చెందిన ఓ కుటుంబం బరేలిలోని దర్గాలో ప్రార్థనలు చేసుకునేందుకు కారులో బయలుదేరారు. మంగళవారం ఉదయం కారు అహ్లాద్‌పూర్ చౌకి ప్రాంతానికి రాగానే కారు టైరు పేలిపోయింది. దీంతో కారు నియంత్రణ కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది.
 
ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వయసు 30 నుంచి 40 యేళ్ల మధ్యలో ఉంటాయని పోలీసులు తెలిపారు. మృతులను మొహ్మద్ తాహిర్, ఇమ్రాన్ ఖాన్, మొహ్మద్ ఫరీద్, మొహ్మద్ సాగిర్‌గా గుర్తించారు. మరో మృతుడి వివరాలు తెలియరాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments