Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులు బాణాసంచా దుకాణంలో పేలుడు.. ఐదుగురి మృతి

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (08:56 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచ్చి జిల్లా శంకరాపురంలో ఓ బాణాసంచా దుకాణంలో మంగళవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
శంకరాపురంలోని సెల్వగణపతి అనే వ్యక్తికి చెందిన టపాకాయాల దుకాణంలో ఈ పేలుడు సంభవించి, ఐదుగురు సజీవ దహనమయ్యారని జిల్లా కలెక్టర్ పిఎన్ శ్రీధర్ తెలిపారు. మరో 11 మంది కార్మికులు గాయపడ్డారని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. 
 
ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశాయి. సహాయక చర్యలు త్వరితగతిన పూర్తిచేశారు. ఈ టపాకాయల దుకాణానికి సమీపంలో ఉన్న ఓ బేకరీ షాపులో చెలరేగిన మంటలు నలువైపులా వ్యాపించాయి. దీంతో బాణాసంచా దుకాణానికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.ే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments