Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులు బాణాసంచా దుకాణంలో పేలుడు.. ఐదుగురి మృతి

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (08:56 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కల్లకురిచ్చి జిల్లా శంకరాపురంలో ఓ బాణాసంచా దుకాణంలో మంగళవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మణం పాలయ్యారు. వీరిలో ముగ్గురు గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
శంకరాపురంలోని సెల్వగణపతి అనే వ్యక్తికి చెందిన టపాకాయాల దుకాణంలో ఈ పేలుడు సంభవించి, ఐదుగురు సజీవ దహనమయ్యారని జిల్లా కలెక్టర్ పిఎన్ శ్రీధర్ తెలిపారు. మరో 11 మంది కార్మికులు గాయపడ్డారని, క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. 
 
ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశాయి. సహాయక చర్యలు త్వరితగతిన పూర్తిచేశారు. ఈ టపాకాయల దుకాణానికి సమీపంలో ఉన్న ఓ బేకరీ షాపులో చెలరేగిన మంటలు నలువైపులా వ్యాపించాయి. దీంతో బాణాసంచా దుకాణానికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.ే

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

"వీక్షణం" సినిమా రివ్యూ - వీక్షణం ఔట్ అండ్ ఔట్ ఎంగేజింగ్ థ్రిల్లర్..

#TheyCallHimOG - షూటింగ్‌లతో పవన్ బిజీ బిజీ

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments