Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భిణీ యువతిపై సామూహిక అత్యాచారం.. ప్రేమికుడి కళ్లముందే ఘోరం..

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (18:31 IST)
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. ప్రేమికుడిపై దాడి చేసి గర్భిణీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, బన్స్‌వారా జిల్లాకు చెందిన 19 ఏళ్ల యువతి, అదే ప్రాంతానికి చెందిన యువకుడితో ప్రేమలో పడింది. వీరిద్దరూ శారీరకంగా కలవడంతో ఆ యువతి గర్భం దాల్చింది. 
 
ఈ నేపథ్యంలో జూలై 13వ తేదీ రాత్రి ఇద్దరూ గ్రామానికి బైకులో వెళ్తుండగా, వారిని కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఆపై ప్రేమికుడిపై దాడికి పాల్పడి, గర్భిణి అయిన యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఆపై అక్కడే ఆ యువతిని వదిలిపెట్టి పారిపోయారు. ఈ దుశ్చర్యతో ఆ యువతికి గర్భస్రావం అయ్యింది. ప్రేయసిని కాపాడలేని దుస్థితికి చేరిన ఆ యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
అయితే తనపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి ఆ యువతి ఎవరికి చెప్పకుండా దాచేసింది. కానీ ప్రియుడి ఆత్మహత్యపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు చేపట్టిన దర్యాప్తులో నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిపై అఘాయిత్యానికి పాల్పడిన ఐదుగురిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం