Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాణాసంచా పేలి 154 మందికి గాయాలు... ఎక్కడ? (Video)

ఠాగూర్
మంగళవారం, 29 అక్టోబరు 2024 (11:31 IST)
కేరళ రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. దీపావళి పండుగ కోసం నిల్వవుంచిన బాణాసంచా పేలి 154 మంది గాయపడ్డారు. నిప్పు రవ్వలు ఎగిసిపడి గదిలో నిల్వచేసిన బాణాసంచాకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులంతా ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ ఘటనలో 154 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని కసరగడ్ జిల్లా నీలేశ్వర్‌లోని అంజుతంబళం వీరెర్కవు ఆలయంలో గత అర్థరాత్రి జరిగింది. సంప్రదాయ తెయ్య పండుగ సందర్భంగా 1500 మంది ప్రజలు ఆలయానికి తరలివచ్చారు. 
 
ఈ సందర్భంగా టపాసులు పేల్చిన నిప్పు రవ్వలు బాణాసంచా నిల్వచేసి గదిలోకి వెళ్లాయి. దీంతో మంటలు చెలరేగి ఆ గదిలో నిల్వవుంచిన బాణాసంచా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి జరిగే ఉత్సవంతో ఈ ఆలయ వేడుకలు ముగియాల్సి వుండగా ఈ అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు ఆలయ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments