Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేషన్‌లో ఆగివున్న రైలు బోగీలో మంటలు.. రెండు నెలల్లో రెండో ఘటన

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (16:41 IST)
కేరళ రాష్ట్రంలోని ఆళప్పుళ - కన్నూరు ప్రాంతాల మధ్య నడిచే ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. కన్నూరు రైల్వే స్టషన్‌లో రైలు ఆగివున్న సమయంలో ఓ బోగీ నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్టేషన్ అధికారులు వెంటనే అప్రమత్తమై మంటలు చెలరేగిన బోగీల నుంచి ఇతర బోగీలను వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఫైరింజన్లతో స్టేషన్‌కు వచ్చిన మంటలను ఆర్పివేశాయి. 
 
ఒక బోగీ నుంచి మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మిగతా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి బోగీలోకి ఎక్కిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. 
 
కాగా, ఏప్రిల్ 2వ తేదీన ఇదే రైలులో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. షారూక్ సఫీ అనే వ్యక్తి రైలు బోగీలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇపుడు మళ్లీ అదే రైలులో అగ్నిప్రమాదం జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments