Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేషన్‌లో ఆగివున్న రైలు బోగీలో మంటలు.. రెండు నెలల్లో రెండో ఘటన

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (16:41 IST)
కేరళ రాష్ట్రంలోని ఆళప్పుళ - కన్నూరు ప్రాంతాల మధ్య నడిచే ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. కన్నూరు రైల్వే స్టషన్‌లో రైలు ఆగివున్న సమయంలో ఓ బోగీ నుంచి మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన స్టేషన్ అధికారులు వెంటనే అప్రమత్తమై మంటలు చెలరేగిన బోగీల నుంచి ఇతర బోగీలను వేరు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది ఫైరింజన్లతో స్టేషన్‌కు వచ్చిన మంటలను ఆర్పివేశాయి. 
 
ఒక బోగీ నుంచి మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది మిగతా బోగీలను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి బోగీలోకి ఎక్కిన కాసేపటికే ఈ ప్రమాదం జరిగినట్టు సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. 
 
కాగా, ఏప్రిల్ 2వ తేదీన ఇదే రైలులో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. షారూక్ సఫీ అనే వ్యక్తి రైలు బోగీలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇపుడు మళ్లీ అదే రైలులో అగ్నిప్రమాదం జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments