Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశువుకు జన్మనిచ్చిన ఐదో తరగతి విద్యార్థిని.... కర్ణాటకలో దారుణం

కర్ణాటక రాష్ట్రంలో ఐదో తరగతి విద్యార్థిని పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ఇంతకీ తమ బిడ్డ గర్భందాల్చినట్టు తెలిసినప్పటికీ... తల్లిదండ్రులు అత్యంత గోప్యంగా ఉంచి పాఠశాలకు పంపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (11:04 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఐదో తరగతి విద్యార్థిని పండంటి శిశువుకు జన్మనిచ్చింది. ఇంతకీ తమ బిడ్డ గర్భందాల్చినట్టు తెలిసినప్పటికీ... తల్లిదండ్రులు అత్యంత గోప్యంగా ఉంచి పాఠశాలకు పంపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కర్ణాటక రాష్ట్రం, చామరాజనగర జిల్లాలోని మలెమహాదేశ్వర బెట్ట వద్ద ఉన్న పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఇక్కడి సమీపంలోని సాంఘికసంక్షేమ హాస్టల్లో ఉంటూ విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. కొంతకాలంగా చదువుకు దూరంగా ఉన్న బాలిక ఇటీవల జూన్ 16న తిరిగి పాఠశాలలో చేరింది. 
 
శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి స్కూల్‌కు వచ్చిన బాలిక మధ్యాహ్నం సమయంలో తీవ్రంగా బాధపడుతుండటంతో సహచరులు ఉపాధ్యాయురాలికి తెలిపారు. వెంటనే ఆమె ఆయాతో కలిసి బాత్‌రూంకు తీసుకెళ్లారు. కొద్దిసేపటికే బాలిక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఉపాధ్యాయురాలు వెంటనే ఈ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.
 
ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చేరవేయగా, వారు ఆస్పత్రికి చేరుకుని, తమ కుమార్తె గర్భదాల్చిన విషయం తెలుసునని, ఈ విషయం తెలిస్తే పాఠశాలలో చేర్చుకోరని తాము ఈ విషయం చెప్పలేదని తెలిపారు. తమ కుమార్తెను ఆమె మేనమామ ప్రేమిస్తున్నానని, ఇలా గర్భవతిని చేశాడని ఈ విషయం ఎవరితో చెప్పవద్దని తమ కుమార్తె కోరిందని వారు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం తల్లి, పిల్ల ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments