Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కాలంలో మహిళా టీచర్లకు తప్పని వేధింపులు.. వీడియోలు చూపిస్తూ..?

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (12:50 IST)
కరోనా కాలంలో ఆన్‌లైన్ క్లాసులంటూ ఉపాధ్యాయులు నానా తంటాలు పడుతున్నారు. ఇలా కష్టపడినా జీతాలు కూడా కొందరు ఉపాధ్యాయులు అందుకోవట్లేదు. ఇవి చాలదన్నట్లు కామాంధులు మాత్రం మహిళా ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేస్తున్నారు. జీతాలు ఇవ్వకపోవడమే కాకుండా తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు మహిళా ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. స్థానికంగా ఉన్న రిషబ్ అకాడమి స్కూల్ సెక్రటరీ రంజిత్ జైన్, ఆయన కుమారుడు అభినవ్ తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు మహిళా టీచర్స్ ఆరోపించారు. తమకు ఎంతోకాలంగా జీతాలు చెల్లించడం లేదని, జీతం డిమాండ్ చేసినప్పుడల్లా పాఠశాల యాజమాన్యం మహిళా ఉపాధ్యాయులతో అసభ్యంగా ప్రవర్తిస్తుందని బాధితులు పేర్కొన్నారు. 
 
అంతేకాకుండా మహిళా టాయిలెట్స్‌లో స్పై కెమెరాలు అమర్చినట్లుగా తెలిపారు. ఈ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ తమతో శారీరక సంబంధం పెట్టుకోవాల్సిందిగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతారన్నారు. యాజమాన్యం చెప్పుచేతుల్లోకి రాని మహిళా టీచర్లను అదుపులోకి తెచ్చుకునేందుకు మంత్రగాళ్లని సైతం ఆశ్రయిస్తారన్నారు. మహిళా ఉపాధ్యాయుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం