Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు 13 కాన్పుల తర్వాత వేసెక్టమీ ఆపరేషన్... ఎక్కడ?

Webdunia
సోమవారం, 3 ఏప్రియల్ 2023 (13:21 IST)
తమిళనాడులో దంపతుల జంటకు ఎట్టకేలకు 13 మందికి జన్మనిచ్చిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ చేయించేందుకు వైద్యాధికారులు మూడు రోజుల శ్రమించాల్సివచ్చింది. ఆ దంపతులకు మూడు రోజుల పాటు కౌన్సిలింగ్ ఇచ్చిన వారిని ఒప్పించి, భర్తకు వేసెక్టమీ ఆపరేషన్ పూర్తి చేశారు. 
 
తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాదైయ్యన్ (46), శాంతి (40) అనే దంపతులు ఉన్నారు. ఈ దంపతులు ఇప్పటికే 12 మందికి పిల్లలకు జన్మనిచ్చారు. మతపరమై సంప్రదాయం కారణంగా వీరిద్దరూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌కు మొగ్గు చూపలేదు. ఫలితంగా ఏడుగురు మగపిల్లలు, ఐదుగురు ఆడపిల్లలు కలిగారు. గత వారం శాంతి మరో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కాన్పుతో కలిపి మొత్తం 13 మంది పిల్లలు. 
 
ఈ కాన్పు తర్వాత శాంతి తీవ్రమైన రక్తహీనతకు గురైంది. మరో బిడ్డకు జన్మనివాల్సి వస్తే ఆ మహిళ చనిపోయే అవకాశం ఉందని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ కె.శాంతి కృష్ణన్ ఆ దంపతులకు వివరించారు. ఆమెతో పాటు వీఏవో, మెడికల్ ఆఫీసర్, పోలీసులంతా కలిసి ఆ దంపతులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వారు కు.ని ఆరేషన్ చేయించుకునేందుకు సమ్మతించారు. దీంతో ఆదివారం ఈరోడ్ జిల్లా అందియూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మాదైయ్యన్‌కు వేసెక్టమీ ఆపరేషన్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments