Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్ ర్యాలీ-సింఘూ సరిహద్దు వద్ద ఉద్రిక్తత.. బారికేడ్లను దాటుకుని..?

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (09:49 IST)
Farmers Rally
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలని చాలా రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు వారంతా ఢిల్లీ సరిహద్దులో కిసాన్ గణతంత్ర పెరేడ్ పేరిట భారీ ఎత్తున ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ భద్రతా వలయంలో వెళ్ళి పోయింది. ఈ ర్యాలీలో పాకిస్థాన్ అల్లర్లకు కుట్ర పన్నిందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.
 
ముందు నుంచి రైతుల ర్యాలీకి అనుమతి లభించకపోగా చివరికి 37 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఢిల్లీ లోపల గణతంత్ర వేడుకలు పూర్తయ్యాక మాత్రమే ర్యాలీ ప్రారంభం అయ్యేలా అనుమతించారు. 
 
ఇక కాసేపట్లో ర్యాలీ ప్రారంభం కానుండగా అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. సింఘూ సరిహద్దు వద్ద రైతులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విచ్ఛిన్నం చేసి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments