Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్టర్ ర్యాలీ-సింఘూ సరిహద్దు వద్ద ఉద్రిక్తత.. బారికేడ్లను దాటుకుని..?

Webdunia
మంగళవారం, 26 జనవరి 2021 (09:49 IST)
Farmers Rally
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను రద్దు చేయాలని చాలా రోజులుగా ఢిల్లీ సరిహద్దులలో రైతులు నిరసన దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు వారంతా ఢిల్లీ సరిహద్దులో కిసాన్ గణతంత్ర పెరేడ్ పేరిట భారీ ఎత్తున ట్రాక్టర్స్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ భద్రతా వలయంలో వెళ్ళి పోయింది. ఈ ర్యాలీలో పాకిస్థాన్ అల్లర్లకు కుట్ర పన్నిందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.
 
ముందు నుంచి రైతుల ర్యాలీకి అనుమతి లభించకపోగా చివరికి 37 షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. అయితే ఢిల్లీ లోపల గణతంత్ర వేడుకలు పూర్తయ్యాక మాత్రమే ర్యాలీ ప్రారంభం అయ్యేలా అనుమతించారు. 
 
ఇక కాసేపట్లో ర్యాలీ ప్రారంభం కానుండగా అనూహ్య ఘటన ఒకటి చోటుచేసుకుంది. సింఘూ సరిహద్దు వద్ద రైతులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విచ్ఛిన్నం చేసి రాజధానిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటులు అమ్ముడుపోయారు - ప్రకాష్ రాజ్ కామెంట్స్

మండాడి నుండి సూరి, సుహాస్ ఫస్ట్ లుక్ విడుదల

రిహాబిలిటేషన్ సెంటర్‌ కు వెళ్ళిన అల్లు అరవింద్, బన్నీ వాసు

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments