Webdunia - Bharat's app for daily news and videos

Install App

26న సంపూర్ణ భారత్ బంద్‌కు రైతు సంఘాల పిలుపు

Webdunia
గురువారం, 11 మార్చి 2021 (07:58 IST)
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చింది. ఈ చట్టాల వల్ల రైతులకు తీవ్ర హాని కలుగుతుందని, కార్పొరేట్ శక్తులు మేలు చేకూర్చేలా ఈ చట్టాన్ని తెచ్చిందని ఆరోపిస్తూ దేశంలోని పలు రైతుల సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే హస్తిన వేదికగా ప్రకంపనలు సృష్టించిన రైతు సంఘాలు ఇపుడు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాయి. 
 
ఇందులోభాగంగా, ఈ నెల 26న పూర్తి స్థాయి భారత్‌ బంద్‌‌కు పిలుపునిచ్చింది. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్‌ బంద్‌ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్‌ తెలిపారు. 
 
ఈ బంద్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. అలాగే పెరిగిన చమురు ధరలు, పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న ట్రేడ్‌ యూనియన్లతో కలిసి ఆందోళనలో పాల్గొనున్నట్లు తెలిపారు. మార్చి 29న హోలీకా దహన్‌పేరిట వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments