Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రలేచి ఎవరి మొహం చూశాడో ఏమోకానీ..?

Webdunia
శనివారం, 14 నవంబరు 2020 (16:54 IST)
నిద్రలేచి ఎవరి మొహం చూశాడో ఏమోకానీ ఓ వ్యక్తి నిద్రలేవగానే ఇంటి పైకప్పుపై రెండు సంచుల్ని గుర్తించాడు. అందులో పెద్దమొత్తంలో నగదు వుండటంతో షాకయ్యాడు. అంతేగాకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. యూపీ మేరఠ్‌లో నివాసం ఉండే పవన్‌ సింఘాల్‌ అనే వ్యాపారి ఇంట్లో నేపాల్‌కు చెందిన రాజు అనే వ్యక్తి పని చేసేవాడు. ఇతను రెండేళ్ల కిందట అక్కడి నుంచి వెళ్లిపోయి ఇటీవల తిరిగొచ్చాడు. ఆ సమయంలో ఇంటి యజమాని లేకపోవడంతో సెక్యురిటీగార్డుతో కలిసి దొంగతనానికి పాల్పడ్డాడు. 
 
దాదాపు రూ. 40 లక్షల నగదు ఉన్న రెండు సంచులతో వెళ్తే సీసీ కెమెరాల్లో నమోదై దొరుకుతాననే ఆలోచనతో వాటిని ఆ ఇంటి పక్కనే ఉన్న మరో ఇంటిపై విసిరేశాడు. తర్వాత వచ్చి సంచులను తీసుకుందామని వాటిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
 
ఈ క్రమంలో మరుసటి రోజు బుధవారం ఉదయం ఆ పక్కింట్లో ఉండే వరుణ్‌శర్మ తన ఇంటిపై ఉన్న సంచుల్లో భారీగా నగదు ఉన్నట్లు గుర్తించారు. ఎవరో డబ్బును దొంగిలించి ఇక్కడ పెట్టి ఉంటారనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో దొంగతనానికి పాల్పడినట్లు తేలిన రాజు, సెక్యూరిటీ గార్డును అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments