Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఈశాన్య' అసెంబ్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీదే హవా

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (20:36 IST)
ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 16వ తేదీన త్రిపుర అసెంబ్లీకి ఎన్నికలు జరుగగా సోమవారం నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. 
 
త్రిపుర రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియాలు నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ రాష్ట్రంలో బీజేపీ కూటమికి 36 నుంచి 45 స్థానాలు వస్తాయని, లెఫ్ట్ కూటమికి 6 నుంచి 11 స్థానాలు, తిప్రా మోథా పార్టీకి 9 నుంచి 16 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. 
 
నాగాలాండ్ రాష్ట్రంలో బీజేపీ - ఎన్డీపీపీ కూటమికి విజయం సాధిస్తుందని తెలిపింది. ఈ కూటమికి 35 నుంచి 43 సీట్లు రావొచ్చని, కాంగ్రెస్ పార్టీకి ఒకటి నుంచి మూడు సీట్లు, ఎన్.పి.ఎఫ్‌కు 2 నుంచి 5 సీట్లు దక్కుతాయని తెలిపింది. 
 
ఇక మేఘాలయ రాష్ట్రంలో నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్.పి.పి) విజయభేరీ మోగిస్తుందని జీన్యూస్ - మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్ వివరించింది., ఎన్.పి.పి.కి 21 నుంచి 26 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్‌కు 8 నుంచి 13 సీట్లు, బీజేపీకి 6 నుంచి 11 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 3 నుంచి 6 సీట్లు, ఇతరులకు 10 నుంచి 19 సీట్లు దక్కే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Udaya Bhanu: పవన్ కల్యాణ్ పరువు తీసిన ఉదయ భాను.. ఏంటి?

అఖండ 2: తాండవం సంగీతం తగతగ తాండవంలా వుంటుందన్న థమన్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments