Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌లో దారుణం... ఆడపిల్లలకు విషపు ఇంజెక్షన్లు

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (18:09 IST)
ముస్లిం దేశాల్లో ఒకటైన ఇరాన్‌లో తాజాగా దారుణం ఒకటి వెలుగు చూసింది. ఈ దేశంలోని కొందరు మతఛాందసవాదులు, సంఘ విద్రోహ శక్తులు కొందరికి ఆడపిల్లలు చదువుకోవడం సుతరామా ఇష్టం లేదు. దీంతో వారు ఆడపిల్లలే లక్ష్యంగా విష ప్రయోగం చేస్తున్నారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో కొందరు సంఘ విద్రోహులు ఈ దారుణానికి పాల్పడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. 
 
టెహ్రాన్‌లో కోమ్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థినిలు భోజనంలో విషం కలిపారు. దీంతో వందలాది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోలయ్యారు. ఈ విషయాన్ని డిప్యూటీ ఆరోగ్య మంత్రి యూనెస్ పనాహీ ఆదివారం అధికారికంగా వెల్లడించారు. ఈ అమానుషానికి పాల్పడిన వారు బాలికలకు విద్య అవసరం లేదని, అందువల్ల బాలికలు చదువుకునే పాఠశాలలను మూసివేయాలని కోరుతున్నారు. 
 
నిజానికి గత యేడాది నవంబరులోనే ఇలాంటి ఘటనలు జరిగాయి. ఆ నెలలో అనేక మంది విద్యార్థినులు శ్వాస తీసుకోలేక ఆస్పత్రి పాలయ్యారు. తాజాగా జరిగిన జరిగిన ఘటనతో గత నెలలో కూడా విద్యార్థినులపై విష ప్రయోగం జరిగినట్టు భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఈ ఘటన పై ఇరాన్ నిఘా వర్గాలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో గత కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెల్సిందే. 22 యేళ్ల కుర్దిష్ మహిళ మహ్స అమినీ మరణంతో మొదలైన ఈ నిరసనలు దేశ వ్యాప్తంగా తీవ్రరూపం దాల్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments