Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇరాన్‌లో దారుణం... ఆడపిల్లలకు విషపు ఇంజెక్షన్లు

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (18:09 IST)
ముస్లిం దేశాల్లో ఒకటైన ఇరాన్‌లో తాజాగా దారుణం ఒకటి వెలుగు చూసింది. ఈ దేశంలోని కొందరు మతఛాందసవాదులు, సంఘ విద్రోహ శక్తులు కొందరికి ఆడపిల్లలు చదువుకోవడం సుతరామా ఇష్టం లేదు. దీంతో వారు ఆడపిల్లలే లక్ష్యంగా విష ప్రయోగం చేస్తున్నారు. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరిగాయి. ఆ సమయంలో కొందరు సంఘ విద్రోహులు ఈ దారుణానికి పాల్పడినట్టు వార్తలు వెలువడుతున్నాయి. 
 
టెహ్రాన్‌లో కోమ్‌లోని ఒక పాఠశాలలో విద్యార్థినిలు భోజనంలో విషం కలిపారు. దీంతో వందలాది మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు లోలయ్యారు. ఈ విషయాన్ని డిప్యూటీ ఆరోగ్య మంత్రి యూనెస్ పనాహీ ఆదివారం అధికారికంగా వెల్లడించారు. ఈ అమానుషానికి పాల్పడిన వారు బాలికలకు విద్య అవసరం లేదని, అందువల్ల బాలికలు చదువుకునే పాఠశాలలను మూసివేయాలని కోరుతున్నారు. 
 
నిజానికి గత యేడాది నవంబరులోనే ఇలాంటి ఘటనలు జరిగాయి. ఆ నెలలో అనేక మంది విద్యార్థినులు శ్వాస తీసుకోలేక ఆస్పత్రి పాలయ్యారు. తాజాగా జరిగిన జరిగిన ఘటనతో గత నెలలో కూడా విద్యార్థినులపై విష ప్రయోగం జరిగినట్టు భావిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కాగా, ఈ ఘటన పై ఇరాన్ నిఘా వర్గాలు లోతుగా విచారణ జరుపుతున్నాయి. హిజాబ్‌కు వ్యతిరేకంగా ఇరాన్‌లో గత కొన్ని నెలలుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెల్సిందే. 22 యేళ్ల కుర్దిష్ మహిళ మహ్స అమినీ మరణంతో మొదలైన ఈ నిరసనలు దేశ వ్యాప్తంగా తీవ్రరూపం దాల్చాయి. 

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీ ఫామ్ హౌస్‌లోనే ఉన్న హేమ?? పట్టించిన దుస్తులు!

ముంబై స్టార్ స్పోర్ట్స్‌లో భార‌తీయుడు 2 ప్రమోషన్స్ షురూ

యాక్షన్ ఎంటర్టైనర్స్ గా శివ కంఠంనేని బిగ్ బ్రదర్ రాబోతుంది

రెండు పార్టులుగా ఫేస్తోన్న మిరాయ్ తో మళ్ళీ వెండితెరపైకి మనోజ్ మంచు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments