Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాడిదలు గర్భందాల్చితే సీమంతాలు.. పిల్లలు పుడితే బారసాలాలు కూడా.. ఎక్కడ...!?

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (16:27 IST)
గర్భందాల్చిన గాడిదలకు సీమంతాలు చేస్తున్నారు. వాటి పిల్లలకు బారసాలలు నిర్వహిస్తున్నారు. ఈ విచిత్ర ఆచారం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంత వాసులు ఇలా చేయడానికి ప్రధాన కారణం లేకపోలేదు. హలరీ అనే గాడిద జాతి అంతరించి పోయే పరిస్థితులు నెలకొనివున్నాయి. ఈ జాతి గాడిదలను కాపాడేందుకు ఆ ప్రాంత ప్రజలు వింతగా సీమంతాలు చేస్తున్నారు. 
 
ఈ జాతి గాడిదల సంఖ్యను పెంచేందుకు చేసే ప్రయత్నాల్లో ఇది ఒకటి. అందుకే ఈ జాతి గాడిదలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. పైగా ఆ గాడిదలకు పుట్టే పిల్లలకు బారసాల కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. మన గృహాల్లో ఏ విధంగా శుభకార్యాలు చేస్తారో అదేవిధంగా ఈ వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. 
 
కొన్ని రోజుల క్రితం ఉప్లేటా తాలూకాలోని కోల్కి అనే గ్రామంలో హరరీ జాతి గాడది ఈనింది. దీంతో ఆ గ్రామ వాసులు సంబరాలు చేసుకున్నారు. పశువులు కాపరులు, ఇతరులు కలిసి బారసాల చేశారు. గర్భందాల్చిన మరో 33 గాడిదలకు కూడా సీమంతం కూడా చేశారు. నుదిటిన తిలకం దిద్ది, వస్త్రాలు కప్పారు. మహిళలు పూజ చేసి, ఆహారం వడ్డించారు. 
 
ఈ కార్యక్రమాన్ని చూసేందుకు కేంద్ర మంత్రి పురుషోత్తం రుపాలా కూడా వచ్చారు. ఈ సందర్భంగా స్థానికులు స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. కాగా, ప్రస్తుతం హలరీ జాతి గాడిదలు గుజరాత్ రాష్ట్రంలో కేవలం 417 మాత్రమే ఉన్నాయి.  

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments