Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ తరపున కోర్టులో వాదించను : ముకుల్ రోహిత్గీ

Webdunia
బుధవారం, 1 జులై 2020 (13:07 IST)
చైనాకు చెందిన యాప్ టిక్ టాక్‌తో పాటు మరో 59 యాప్‌లపై కేంద్రం నిషేధం విధించింది. అయితే, టిక్ టాక్ సంస్థ కోర్టును ఆశ్రయించనుంది. ఆ సంస్థ తరపున మాజీ అటార్నీ జనరల్ వాదించబోనని తేల్చి చెప్పారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చైనా యాప్‌ తరుపున కోర్టుకు వెళ్లబోనని స్పష్టం చేశారు. 
 
దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రత నేపథ్యంలో చైనాకు సంబంధించిన 59 యాప్‌లను భారత్‌ సోమవారం నిషేధించిన సంగతి తెలిసిందే. టిక్‌ టాక్‌తోసహా లైకీ, యూసీ బ్రౌజర్‌, కామ్‌స్కానర్‌, విగొ వీడియో, వంటి పలు యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. 
 
తూర్పు లఢక్‌ సరిహద్దులో ఈ నెల 15న భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో భారత్‌ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది. 
 
మరోవైపు తమ యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు టిక్‌టాక్‌ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా మాజీ అటర్నీ జనరల్‌ ముకుల్ రోహత్గిని ఆ సంస్థ ఆశ్రయించింది. 
 
తమ తరపున కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి వాదించాలని కోరింది. అయితే టిక్‌ టాక్‌ విన్నపాన్ని ముకుల్ రోహత్గి తిరస్కరించారు. చైనా యాప్‌ తరపున భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను కోర్టులో వాదించబోనని ఆ సంస్థకు స్పష్టం చేశారు. దీంతో నిషేధంపై కోర్టుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్న టిక్‌టాక్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments