Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్కెట్ ఇవ్వలేదన్న మనస్తాపంతో పురుగుల మందు సేవించిన ఎంపీ మృతి!!

వరుణ్
గురువారం, 28 మార్చి 2024 (11:22 IST)
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ రాలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఈరోడ్ సిట్టింగ్ ఎంపీ గణేశమూర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గురువారం ఉదయం 5 గంటల సమయంలో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎండీఎంకే పార్టీ ఆయనకు టిక్కెట్ నిరాకరించింది. దీంతో ఆయన మనస్తాపం చెంది ఈ నెల 24వ తేదీన తన నివాసంలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ వెంటనే ఆయన్ను కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూ వార్డులో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో గణేశమూర్తి మరణించారని వైద్యులు తెలిపారు. 
 
కాగా, గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి భాగస్వామి పార్టీ అయిన ఎండీఎంకే పార్టీ తరపున ఆయన పోటీ చేసి విజయం సాధించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన మరోమారు పోటీ చేయాలని భావించినప్పటికీ ఆయనకు పార్టీ టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు. ఆయన మృతిపట్ల ఎండీఎంకే నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments