Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్ సమయంలో పీఎఫ్ నుంచి వేల కోట్లు నగదు విత్ డ్రా, కేంద్ర మంత్రి

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:14 IST)
మార్చి నెలలో లాక్‌డౌన్ మొదలైన తర్వాత ఆగస్టు 31 వరకు తమ భవిష్య నిధి దాచుకున్న ఉద్యోగులు పెద్దఎత్తున నగదు విత్ డ్రా చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ వెల్లడించారు. మార్చి నెల 25 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు రూ. 39, 402.90 కోట్లను ఉద్యోగులు విత్ డ్రా చేసుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్‌కు లిఖిత పూర్వక సమాధానాన్ని పంపించారు.
 
ఈ ఐదు నెలల వ్యవధిలో మహారాష్ట్రకు చెందిన ఉద్యోగులు అత్యధికంగా నగదును విత్ డ్రా చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి రూ.7,837.80 కోట్లు విత్ డ్రా కాగా ఆ తర్వాత కర్ణాటక నుంచి రూ.5,743.90 కోట్లు, తమిళనాడు నుంచి రూ.4,984.50 కోట్లు విత్ డ్రా అయ్యాయని వెల్లడించారు. కరోనా కాలంలో కష్టాలు అనుభవిస్తున్న వలస కూలీలు కోసం కేంద్రం ప్రధాన మంత్రి గరీభ్ కల్యాణ్ యోజన, ఆత్మ నిర్బర్ భారత్ స్కీంల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.
 
ఈ కార్యక్రమంలో భాగంగా నెలకు రూ.15 వేలు కన్నా తక్కువ వేతనం పొందుతున్న వారు లబ్ధిని పొందారని తెలిపారు. మే నుంచి జూలై వరకు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను కూడా 12 నుంచి 10 శాతానికి తగ్గించామని సంతోష్ గాంగ్వార్ వెల్లడించారు. లాక్ డౌన్లో ఉద్యోగుల సంక్షేమం కోసం కేంద్రం అన్ని చర్యలు తీసుకుందన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

నా పక్కన నాన్న, మామ ఇలా మగవాళ్లు పడుకుంటే భయం: నటి స్నిగ్ధ

Grammys 2025: వెస్ట్ అండ్ బియాంకా సెన్సోరిని అరెస్ట్ చేయాలి.. దుస్తులు లేక అలా నిలబడితే ఎలా?

సౌత్ లో యాక్ట్రెస్ కు భద్రతా లేదంటున్న నటీమణులు

సింగిల్ విండో సిస్టమ్ అమలు చేయాలి : మారిశెట్టి అఖిల్ చిత్రం షూటింగ్లో నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments