కళాశాలలో వేధింపులు.. పీహెచ్‌డీ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య

Webdunia
సోమవారం, 13 జనవరి 2020 (12:48 IST)
తమిళనాడు రాజధాని, చెన్నై నగరంలోని ఓ కళాశాలలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. తాజాగా ఇలాంటి ఘటనే సేలం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని సేలం జిల్లా పెరియార్ వర్శిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
నివేద అనే విద్యార్థిని పీహెచ్డీ రెండో సంవత్సరం చేస్తూ, ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇంకా నివేద రాసిన రాసిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. కళాశాలలో వేధింపులతోనే తాను ఆత్మహత్యకు పాల్పడిందని తోటి విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. 
 
ఇటీవల వర్శిటీకి చెందిన ఓ ఉన్నతాధికారి, విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించారని, దీనిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు కూడా చేసిందని విద్యార్థి సంఘాలు తెలియజేశాయి. నివేద కూడా ఆ అమ్మాయి విభాగమే కాబట్టి, పూర్తి పారద్శకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments