Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైనాపిల్ పండులో పటాసులు, ఆకలితో తిన్న ఏనుగు...

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (20:13 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
కొందరు చేసిన పనికి గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే... కేరళ లోని పాలక్కడ్‌, మలప్పురం జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఉండే ఏనుగు ఆహారం కోసం సమీపంలోని గ్రామ శివారుకి వచ్చింది. ఐతే తమ పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయని వాటిని కాపాడుకునేందుకు స్థానికులు బాణసంచాతో నింపిన పైనాపిల్‌ పండ్లను అక్కడ పెట్టారు. ఐతే ఆకలితో వున్న ఏనుగు ఆ పండ్లను నోటితో అందుకుంది.
 
అంతే... పైనాపిల్ నోటి వద్దకు వెళ్లగానే టపాసులు పెద్ద శబ్దం చేస్తూ పేలాయి. దాంతో ఏనుగు తీవ్ర గాయాలపాలై అల్లాడిపోయింది. ఏనుగు నాలుక, నోరు, తొండం తీవ్రంగా గాయాలు కావడంతో సమీపంలోని నదిలోకి వెళ్లి గాయాలపై నీళ్లు చల్లుకుంటూ అలానే వుంది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు.
 
కానీ ఆ ఏనుగు నది మధ్యలోనే ప్రాణాలు విడిచింది. చనిపోయిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించగా దాని కడుపులో నెల రోజుల గున్న ఏనుగు పిల్ల వున్నట్లు గుర్తించారు. పైనాపిల్ టపాసుల ధాటికి తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు రెండూ చనిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోను ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌కు చెందిన అధికారి మోహన్‌ కృష్ణన్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments