Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైనాపిల్ పండులో పటాసులు, ఆకలితో తిన్న ఏనుగు...

Webdunia
బుధవారం, 3 జూన్ 2020 (20:13 IST)
ఫోటో కర్టెసీ-ట్విట్టర్
కొందరు చేసిన పనికి గర్భంతో ఉన్న ఏనుగు మృతి చెందింది. వివరాల్లోకి వెళితే... కేరళ లోని పాలక్కడ్‌, మలప్పురం జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఉండే ఏనుగు ఆహారం కోసం సమీపంలోని గ్రామ శివారుకి వచ్చింది. ఐతే తమ పంటలను అడవి పందులు నాశనం చేస్తున్నాయని వాటిని కాపాడుకునేందుకు స్థానికులు బాణసంచాతో నింపిన పైనాపిల్‌ పండ్లను అక్కడ పెట్టారు. ఐతే ఆకలితో వున్న ఏనుగు ఆ పండ్లను నోటితో అందుకుంది.
 
అంతే... పైనాపిల్ నోటి వద్దకు వెళ్లగానే టపాసులు పెద్ద శబ్దం చేస్తూ పేలాయి. దాంతో ఏనుగు తీవ్ర గాయాలపాలై అల్లాడిపోయింది. ఏనుగు నాలుక, నోరు, తొండం తీవ్రంగా గాయాలు కావడంతో సమీపంలోని నదిలోకి వెళ్లి గాయాలపై నీళ్లు చల్లుకుంటూ అలానే వుంది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు.
 
కానీ ఆ ఏనుగు నది మధ్యలోనే ప్రాణాలు విడిచింది. చనిపోయిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించగా దాని కడుపులో నెల రోజుల గున్న ఏనుగు పిల్ల వున్నట్లు గుర్తించారు. పైనాపిల్ టపాసుల ధాటికి తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు రెండూ చనిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోను ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీమ్‌కు చెందిన అధికారి మోహన్‌ కృష్ణన్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments