Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహించాలి.. మాయావతి డిమాండ్

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (19:09 IST)
సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) నేత మాయావతి బీజేపీపై మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలతో హైజాక్‌ చేసిందని మాయావతి వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికల ఫలితాలపై ఆమె స్పందిస్తూ అధికారంలో ఉన్న బీజేపీ ఈవీఎంలను హైజాక్ చేసి దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి మహాకూటమిగా రంగంలోకి దిగిన బీఎస్పీ చతికిలపడింది. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవీఎంలకు వ్యతిరేకంగా యావత్‌ భారతదేశమంతా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది, ఈ ఫలితాలను చూశాక దేశ ప్రజలకు ఈవీఎంలపై నమ్మకం పోయిందని ఆమె విమర్శించారు. 
 
ఈవీఎంలకు బదులు సాంప్రదాయ పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమండ్‌ చేశారు. ఎన్నికల సంఘం, బీజేపీ రెండూ కూడా బ్యాలెట్‌ పేపర్లను వ్యతిరేకిస్తున్నాయంటే వీరి మధ్య ఏవో రహస్య సంబంధం ఉందని మాయావతి ఆరోపించారు. మహాకూటమికి వచ్చిన స్పందన మేము ఊహించలేదని, ఫలితాలు ప్రజాభీష్టానికి భిన్నంగా వచ్చాయని ఆమె ఆరోపించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments