Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ విడుదల - జూలై 18న పోలింగ్

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (19:38 IST)
దేశ ప్రథమ పౌరుడు (రాష్ట్రపతి) ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం ఈ నెల 15వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్‌ను అధికారికంగా జారీ చేస్తారు. ఆ తర్వాత 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 2వ తేదీ వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇస్తారు. జూలై 18 తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, 21వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
 
ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న బీహార్ రాష్ట్రానికి చెందిన రాంనాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల 24వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జూలై 25వ తేదీలోగా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సివుంది. దీనికి అనుగుణంగానే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు రాజీవ్ కుమార్ తెలిపారు. నామినేషన్ల పర్వం, ఓట్ల లెక్కింపు ఢిల్లీలోనే జరుగుతుంది. పోలింగ్ మాత్రం పార్లమెంటుతో పాటు ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఆవరణాల్లో నిర్వహిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments