Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా - రాహుల్‌లకు సమన్లు జారీచేసిన ఈడీ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (14:51 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో వీరిద్దరూ తమ ఎదుట గురువారం విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో పేర్కొన్నారు. 
 
ఒకపుడు అత్యంత ప్రజాదారణ పొందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కాంగ్రెస్ పార్టీ నడుపుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ పత్రిక ముద్రణను మూసివేసింది. అయితే, ఈ పత్రికకు రాజధాని ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని రాహుల్ గాంధీ తన ఖాతాలో చూపించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
 
ఇదే అంశంపై బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ పాటియాల్ హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టుకు సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు. ఇపుడు ఇదే కేసులో ఈడీ సమన్లు జారీ చేయడం, విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments