Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా - రాహుల్‌లకు సమన్లు జారీచేసిన ఈడీ

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (14:51 IST)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఎన్‌‍ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో వీరిద్దరూ తమ ఎదుట గురువారం విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో పేర్కొన్నారు. 
 
ఒకపుడు అత్యంత ప్రజాదారణ పొందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కాంగ్రెస్ పార్టీ నడుపుతూ వచ్చింది. ఆ తర్వాత ఈ పత్రిక ముద్రణను మూసివేసింది. అయితే, ఈ పత్రికకు రాజధాని ఢిల్లీతో సహా అనేక ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిని రాహుల్ గాంధీ తన ఖాతాలో చూపించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి.
 
ఇదే అంశంపై బీజేపీ ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీ పాటియాల్ హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఈ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టుకు సోనియా, రాహుల్ గాంధీలు కోర్టు మెట్లెక్కారు. ఇపుడు ఇదే కేసులో ఈడీ సమన్లు జారీ చేయడం, విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments