Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం : అంబటి రాంబాబు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (14:33 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువంటూ ఏదీ లేదన్నారు. పైగా, ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగానే పూర్తవుతుందని మంత్రివర్యులు సెలవిచ్చారు. 
 
ఆయన బుధవారం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ హయాంలో జరిగిన చారిత్రాత్మక తప్పిదం కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి తేల్చిపారేశారు. పైగా, ఈ డయాఫ్రం వాల్ ఎవరివల్ల దెబ్బతిందో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, గత ప్రభుత్వంలో జలవనరుల శాఖామంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వర రావులు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ఇంజనీర్లు, మేథావులు, మీడియా  సమక్షంలో ఈ చర్చ జరగాల్సివుందన్నారు. కాపర్ డ్యాం కట్టడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుధీర్ బాబు జటాధర నుంచి ఫస్ట్ ట్రాక్ సోల్ అఫ్ జటాధర రిలీజ్

Shraddha Srinath: గేమింగ్ డెవలపర్‌గా నటించడం ఛాలెంజ్ గా వుంది: శ్రద్ధా శ్రీనాథ్

OG sucess: త్రివిక్రమ్ వల్లే ఓజీ చేశాం, సక్సెస్ తో మాటలు రావడంలేదు : డివివి దానయ్య

ట్రాన్: అరేస్‌లో నా హీరో జెఫ్ బ్రిడ్జెస్: ఒక లెజెండ్, ది బెస్ట్ అంటున్న జారెడ్ లెటో

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments