Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం : అంబటి రాంబాబు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (14:33 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువంటూ ఏదీ లేదన్నారు. పైగా, ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగానే పూర్తవుతుందని మంత్రివర్యులు సెలవిచ్చారు. 
 
ఆయన బుధవారం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ హయాంలో జరిగిన చారిత్రాత్మక తప్పిదం కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి తేల్చిపారేశారు. పైగా, ఈ డయాఫ్రం వాల్ ఎవరివల్ల దెబ్బతిందో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, గత ప్రభుత్వంలో జలవనరుల శాఖామంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వర రావులు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ఇంజనీర్లు, మేథావులు, మీడియా  సమక్షంలో ఈ చర్చ జరగాల్సివుందన్నారు. కాపర్ డ్యాం కట్టడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments