Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం : అంబటి రాంబాబు

Webdunia
బుధవారం, 1 జూన్ 2022 (14:33 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు గడువంటూ ఏదీ లేదన్నారు. పైగా, ఏ ప్రాజెక్టు అయినా దశలవారీగానే పూర్తవుతుందని మంత్రివర్యులు సెలవిచ్చారు. 
 
ఆయన బుధవారం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ హయాంలో జరిగిన చారిత్రాత్మక తప్పిదం కారణంగానే డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి తేల్చిపారేశారు. పైగా, ఈ డయాఫ్రం వాల్ ఎవరివల్ల దెబ్బతిందో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, గత ప్రభుత్వంలో జలవనరుల శాఖామంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వర రావులు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ చేశారు. ఇంజనీర్లు, మేథావులు, మీడియా  సమక్షంలో ఈ చర్చ జరగాల్సివుందన్నారు. కాపర్ డ్యాం కట్టడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

డేటింగ్ యాప్‌లపై కంగనా రనౌత్ ఫైర్.. అదో తెలివి తక్కువ పని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments