శివసేన నేత సంజయ్ రౌత్ అరెస్టు : శివసేన అంతానికి కుట్ర!

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (19:58 IST)
మహారాష్ట్రలో ఆదివారం కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. శివసేన పార్టీకి చెందిన సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం నుంచి ఆయన నివాసంలో సంజయ్ రౌత్ నివాసంలో సోదాలు చేసిన ఈడీ అధికారులు.. సాయంత్రానికి ఆయన్ను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత భారీగా బలగాలు మొహరింపు, భద్రత మధ్య సంజయ్ రౌత్‌ను ఈడీ అధికారులు తమ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. 
 
తన అరెస్టుపై సంజయ్ రౌత్ స్పందించారు. ఈడీ అధికారులు అదుపులోకి తీసున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "నాకు వ్యతిరేకంగా తప్పుడు ఆధారాలను సృష్టించారు. శివసేనకు, నాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర ఇది. దీనికి నేను భయపడను" అని ప్రకటించారు. 
 
అలాగే, సంజయ్ రౌత్ అరెస్టుపై శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే స్పందిస్తూ, తమ పార్టీని అంతం చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలపై ఈడీ దాడులకు పాల్పడుతున్నారని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ దాడులు ఈ కుట్రలో భాగమేనని, ఆయనను అరెస్టు చేసేందుకే ఇదంతా చేశారని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

Aari: అరి సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉందన్నారు : డైరెక్టర్ జయశంకర్

మటన్ సూప్ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా: డైరెక్టర్ వశిష్ట

కరూర్ తొక్కిసలాట సమిష్ట వైఫల్యం : రిషబ్ శెట్టి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments