Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేఘాలయాలో భూప్రకంపనలు - రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదు

Webdunia
గురువారం, 24 నవంబరు 2022 (08:13 IST)
ఈశాన్య భారతం వరుస భూకంపాలతో వణికిపోతోంది. బుధవారం అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో భూప్రకంపనలు కనిపించాయి. గురువారం మేఘాలయ రాష్ట్రంలో భూకంపం సభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 3.4గా నమోదైంది. 
 
గురువారం తెల్లవారుజామున 3.46 గంటల సమయంలో మేఘాలయ రాష్ట్రంలోని తురాలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 3.4గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రాన్ని తురాకు 37 కిలోమీటర్ల దూరంలో గుర్తించినట్టు తెలిపారు. భూపొరల్లో 5 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని తెలిపింది. 
 
కాగా, బుధవారం 7 గంటలకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బాసరలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇది రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా ఉంది. అంతకుముందు మహారాష్ట్రలో నాసిక్‌లో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వల్పంగా భూమి  కంపించిన విషయం తెల్సిందే. ఇది రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదైంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments