Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్ కత్రాలో స్వల్ప భూకంపం

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (07:58 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కత్రాలో గురువారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 3.5గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఈ భూప్రకంపనలు గురువారం తెల్లవారుజామున 3.02 గంటల సమయంలో కనిపించాయని పేర్కొంది. 
 
కత్రాకు 84 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రంగా గుర్తించినట్టు ఎస్.సి.ఎస్ తెలిపింది. అయితే, భూ ప్రకంపనల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియలేదు. 
 
ఇదిలావుంటే, పహల్గామ్‌లో బుధవారం ఉదయం 5.43 గంటల సమయంలో భూమి కంపించిన విషయం తెల్సిందే. దీని తీవ్రత 3.2గా నమోదైందని ఎన్.సి.ఎస్ వెల్లడించింది. పహల్గామ్‌కు 15 కిమీ దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నెల 5వ తేదీ కూడా జమ్మూ డివిజన్‌లో 5.9 తీవ్రతతో ఓ భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments