దేశ ప్రజలకు రాష్ట్రపతి - ప్రధాని - తెలుగు రాష్ట్రాల సీఎం విజయదశమి శుభాకాంక్షలు

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2022 (11:53 IST)
దేశ వ్యాప్తంగా విజయదశమి పండుగను బుధవారం ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగ్దీష్ దన్కర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్. జగన్, కె.చంద్రశేఖర్ రావులు శుభాకాంక్షలు తెలియజేశారు. 
 
"విజయదశమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. అనైతికతపై నీతి, అసత్యంపై సత్యం, చెడుపై మంచి సాధించిన విజయానికి ఈ దసరా ప్రతీక. ఈ పండగ దేశ ప్రజలందరిలో సంతోషం, శాంతి తీసుకురావాలి" అంటూ రాష్ట్రపతి ముర్ము విడుదల చేసిన సందేశంలో పేర్కొన్నారు. 
 
"విజయానికి ప్రతీక అయిన విజయదశమి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాక్షలు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో ధైర్యం, సంయమనం, సానుకూల శక్తి తీసుకురావాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని మోడీ కోరారు. 
 
అలాగే, ప్రజలకు సీఎం కేసీఆర్ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ధర్మ స్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం అన్నారు. 
 
అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన, దేశానికి ఆదర్శంగా నిలిచిందని అభిప్రాయ‌పడ్డారు. తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడువాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. అలాగే ఏపీ సీఎం జగన్ కూడా విజయదశమి శుక్షాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments