మద్యం సేవించి రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన వ్యక్తి అరెస్టు

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (18:02 IST)
కేరళ రాష్ట్రంలోని కన్నూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని కన్నూరుకు చెందిన జయప్రకాశన్‌(48)గా గుర్తించినట్టు కేరళ పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఈ నెల 18వ తేదీ రాత్రి సమయంలో జరిగహింది. 
 
జయప్రకాశన్ రోడ్డు కారును నడుపుకుంటూ వెళుతూ సిటీ లోపల ఉన్న రైల్వే ట్రాక్‌పైకి కారు పోనివ్వడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆ సమయంలో అతడు మద్యం మత్తులో ఉన్నాడని వెల్లడించిన పోలీసులు.. రైల్వే ట్రాక్‌ను అడ్డరోడ్డు అని తప్పుగా అనుకొని కారు నడిపినట్టు తెలుస్తోందన్నారు. 
 
అయితే, ఆ కారు కొన్ని మీటర్ల వరకు ట్రాక్‌పై వెళ్లి తర్వాత పట్టాలపై ఇరుక్కుపోయిందని పోలీసులు తెలిపారు. దీంతో రైల్వే గేట్‌ కీపర్‌, స్థానికులు పోలీసులకు, సమీపంలోని రైల్వే స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమయ్యారు. 
 
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జులై 19న అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బెయిల్‌పై అతడిని విడుదల చేయడానికి ముందు కారును సీజ్‌ చేశారు. కారు పట్టాలపై ఉన్న సమయంలో రైళ్లు రాకపోవడంతో అతడి ప్రాణాలకు ముప్పు తప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

Raashi Khanna: పవన్ కళ్యాణ్ చుట్టూ ఓ ఆరా వుంది - సిద్దు సీరియస్ గా వుంటారు : రాశి ఖన్నా

Nitin: ముగ్గురు హీరోలు వదులుకున్న ఎల్లమ్మ చిత్రం.. ఎందుకని?

40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన: విజయశాంతి ట్వీట్

Satya Dev: వసుదేవసుతం టీజర్ ను అభినందించిన సత్య దేవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

బొప్పాయి పండును తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments