Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతి.. వెంకయ్య నాయుడు స్పష్టీకరణ

విస్తృత ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి వస్తుందేగానీ, దొడ్డిదోవన రాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మధ్య విభజన తెచ్చేందుకే బీజ

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (13:14 IST)
విస్తృత ఏకాభిప్రాయంతోనే ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి వస్తుందేగానీ, దొడ్డిదోవన రాదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టంచేశారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల మధ్య విభజన తెచ్చేందుకే బీజేపీ కావాలని వివాదాస్పద అంశాలను లేవనెత్తుతోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. 
 
ట్రిపుల్‌ తలాక్‌, ఉమ్మడి పౌరస్మృతి, రామాలయం వంటి అంశాలను యూపీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం బీజేపీ వాడుకోబోదని.. అభివృద్ధి ఎజెండాతోనే ఎన్నికల్లో ముందుకు వెళతామని ఆయన తేల్చి చెప్పారు. 'ట్రిపుల్‌ తలాక్‌ను ప్రభుత్వం మతపరమైన అంశంగా చూడట్లేదు. మేం (ప్రభుత్వం) ముస్లింల అంశాల్లో జోక్యం కల్పించుకుంటున్నామనడం తప్పు. ఇదే భారత పార్లమెంట్, ఇదే రాజకీయ వ్యవస్థ హిందూ కోడ్‌ బిల్లును, విడాకుల చట్టాన్ని తెచ్చాయి. వరకట్న దురాచారాన్ని, సతీసహగమనాన్ని ఇదే భారత పార్లమెంట్ నిషేధించింది' అని ఆయన గుర్తు చేశారు. 
 
'గతంలో సతీ సహగమనాన్ని నిషేధించినప్పుడు.. అది హిందూ ఆచారమని, ప్రభుత్వం దాంట్లో జోక్యం చేసుకుంటోందని అప్పట్లో ఎవరూ చెప్పలేదే' అని వెంకయ్య ప్రశ్నించారు. వివక్షా పూరితమైన, మహిళలకు అన్యాయం చేసే ఆచారాలకు ముగింపు పలకాల్సిందేనన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ను వ్యతిరేకిస్తూ పలువురు ముస్లిం మహిళలు, ముస్లిం సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతిని వెంకయ్య గుర్తుచేశారు.
 
ఇకపోతే... తాము ఉమ్మడి పౌరస్మృతి గురించి చర్చించట్లేదన్నారు. లా కమిషనే ఒక ప్రశ్నపత్రాన్ని విడుదల చేసిందని.. దానిపై ప్రజాభిప్రాయాన్ని కోరిందని వివరించారు. నవంబరు 21లోగా ఈ అంశంపై పార్టీల అభిప్రాయాన్ని కూడా అడిగిందన్నారు. ట్రిపుల్‌ తలాక్‌పై సుప్రీంకోర్టు సరైన నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వెంకయ్య వ్యక్తం చేశారు. అలాగే.. అయోధ్యలో రాముడు పుట్టినచోట అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకు సం ధిత భాగస్వాములందరి మధ్యా ఒప్పందం కుదరాలని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments