Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపులో రెండు కత్తెరలు.. 12 యేళ్ళుగా మహిళ అవస్థలు

ఠాగూర్
ఆదివారం, 20 అక్టోబరు 2024 (10:39 IST)
ఒక వైద్యుడు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఓ మహిళ రెండు కత్తెరలతో 12 యేళ్ళుగా అవస్థలు పడుతూ వచ్చింది. ఆపరేషన్‌కు ఉపయోగించే రెండు కత్తెరలు ఉంచి కుట్లు వేసిన 12 ఏళ్ల తర్వాత బయటపడింది. 
 
సిక్కిం రాష్ట్రానికి చెందిన ఓ మహిళ 12 యేళ్ళ క్రితం గ్యాంగ్‌టక్‌లోకి ఓ ఆస్పత్రిలో అపెండిక్స్ ఆపరేషన్ చేయించుకుంది. అప్పటి నుంచి ఆ మహిళ తరచుగా కడుపునొప్పితో ఇబ్బంది పడుతూ వచ్చింది. చాలా మంది వైద్యులను సంప్రదించినప్పటికీ నొప్పితగ్గలేదు. నొప్పికి కారణం కూడా చెప్పలేకపోయారు. అయితే, ఈ నెల 8వ తేదీన ఆమెకు తనకు గతంలో ఆపరేషన్‌ చేసిన ఆస్పత్రి వెళ్ళి వైద్యులను సంప్రదించగా, వారు అనుమానంతో ఎక్స్‌రే తీయించగా అసలు విషయం బయటపడింది. 
 
ఆమె పొత్తి కడుపులో రెండు సర్జికల్ కత్తెరలు ఉన్నట్టు గుర్తించారు దీంతో వెంటనే ఆ మహిళకు ఆపరేషన్ చేసి రెండు కత్తెరలను తొలగించారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటోంందని వైద్యులు వెల్లడించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆస్పత్రి వైద్యులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments