Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ సోకి ఇంట్లో మరణించినా పరిహారం అందిస్తాం..

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (10:36 IST)
కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఆస్పత్రిలోనే కాదు.. ఇంట్లో మరణించినా కూడా పరిహారం అందిస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇంట్లో మరణిస్తే వైద్యుడి ధృవీకరణ పత్రం తప్పనిసరిగా జతచేయాల్సి వుంటుందని తెలిపింది. రోగి ‘కరోనాతో మృతి చెందారు’ అంటూ వైద్యుడు జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందుపరచాలని సూచించింది. దీని ఆధారంగా బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం అందుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 
 
సాధారణంగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 25 రోజుల్లోపే 95 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. కొవిడ్‌గా తేలిన తేదీ నుంచి 30 రోజుల్లోపు సంభవించే మరణాలనూ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కొన్ని సందర్భాల్లో నెల దాటిన తర్వాత కూడా మహమ్మారితో మరణిస్తున్నారు. వైద్యుడు ధ్రువీకరిస్తే అటువంటి వారికి పరిహారం అందించాలని సూచించింది. 
 
కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా రూ.50 వేల చొప్పున పరిహారం అందించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రాథమిక మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పంపించింది. అయితే.. ఇవి ప్రాథమిక మార్గదర్శకాలేననీ, పూర్తిస్థాయిలో మార్గదర్శకాలు వచ్చిన తరవాతే పరిహారం అంశంపై దృష్టి పెడతామని తెలంగాణ రాష్ట్ర వైద్య శాఖ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments