Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల-ఉచితంగా ట్యాబ్‌లు, పెట్రోల్ తగ్గింపు

Webdunia
శనివారం, 13 మార్చి 2021 (16:54 IST)
తమిళనాడులో వచ్చే నెల ఎన్నికలు జరుగున్నాయి. ఇందులో భాగంగా డీఎంకే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే తమిళనాట ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రజలను ఆకర్షించే పథకాల రచన చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ 2021, మార్చి 13వ తేదీ శనివారం ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
 
విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధికి తమ మేనిఫెస్టోలో ప్రాధాన్యం కల్పించినట్లు స్టాలిన్ తెలిపారు. ప్రజలకు భారంగా మారిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌పై ప్రధానంగా ఈ పార్టీ దృష్టి సారించింది. తమను గెలిపించినట్లయితే…లీటర్ పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ. 4 తగ్గిస్తామని, అలాగే.. వంట గ్యాస్ సిలిండర్ రాయితీ రూ. 100 ఇస్తామని మేనిఫెస్టోలో వెల్లడించింది.
 
మహిళల ప్రసూతి సెలవుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. వారికి 12 నెలల పాటు ప్రసూతి హాలీడేస్ ఇస్తామని వెల్లడించింది. విద్యార్థులపై ప్రధానంగా దృష్టి సారించింది ఆ పార్టీ. ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందిస్తామని తెలిపింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments