Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో పూజారులుగా ఎస్సీలు - ఎంబీసీలు : సీఎం స్టాలిన్

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (16:44 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ఆలయాల్లో పూజలు చేసేందుకు వీలుగా బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించారు. 
 
ఇప్పటికేవరకు బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన దేవాలయాల్లో అర్చకత్వం ఇప్పుడు బ్రాహ్మణేతరులకు కూడా అనుమతినిస్తూ సీఎం స్టాలిన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
ఇందుకోసం సుశిక్షితులైన 24 మంది బ్రాహ్మణేతరులను పలు పుణ్యక్షేత్రాల్లో అర్చకులుగా నియమించింది. వీరిలో ఐదుగురు షెడ్యూల్ కులాలకు చెందిన వారు కాగా, మరో ఆరుగురు ఎంబీసీలు, 12 మంది బీసీలు, ఓసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. 
 
వీరితో పాటు మరో 138 మందిని ఆలయాల్లో పని చేయడానికి నియమించారు. వీరందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేయబోతున్నారు. గత మే నెలలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్ వంద రోజుల పాలనతో అన్ని వర్గాల ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments