మన్మోహన్ సింగ్‌కు మొండిచేయి చూపిన ఎంకే స్టాలిన్!

Webdunia
సోమవారం, 1 జులై 2019 (17:03 IST)
మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్‍కు డీఎంకే అధ్యక్షుడు ఎంకే.స్టాలిన్ మొండిచేయి చూపించారు. పైగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వినతిని కూడా తోసిపుచ్చారు.
 
మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోయింది. దీంతో ఆయన్ను తమిళనాడు నుంచి రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇందుకోసం మిత్రపక్షమైన డీఎంకేకు రాహుల్ విజ్ఞప్తి చేశారు. డీఎంకే కోటాలో ఉన్న మూడు రాజ్యసభ సీట్లలో ఒక్క సీటును మన్మోహన్ సింగ్‌కు కేటాయించాలని కోరారు. అయితే, రాహుల్ వినతిని స్టాలిన్ నిర్ద్వద్వంగా తోసిపుచ్చారు. 
 
పైగా, తమ పార్టీకి చెందిన ఇద్దరు నేతల పేర్లను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. వీరిలో ఒకరు న్యాయవాది విల్సన్ కాగా, మరొకరు సీనియర్ నేత షణ్ముగంలు ఉన్నారు. ఇంకోసీటును సంకీర్ణ భాగస్వామి వైకోకు ఇవ్వనున్నారు. 
 
డీఎంకే - ఎండీఎంకే పార్టీల మధ్య ఈ అవగాహన ఎన్నికలకు ముందే కుదిరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ద్వైవార్షిక కోటాలో ఖాళీ అయ్యే సీట్లలో భాగంగా ఈ రాష్ట్రం నుంచి 6 రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో నాలుగు అధికార అన్నా డీఎంకే నాయకులు కాగా, ఒకరు డీఎంకే నుంచి, మరొకరు సీపీఐ సభ్యుల పదవీ కాలం ముగుస్తోంది. 
 
డీఎంకే సభ్యురాలు కనిమొళి కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈమె ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. దీంతో ఈ స్థానం కూడా ఖాళీగా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: దీపావళి శుభాకాంక్షలతో అక్కినేని అఖిల్, జైనాబ్ రవ్జీ

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments