Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంటి బిడ్డను వీపుకు కట్టుకుని.. మరిది శవాన్ని భర్తతో కలిసి మోసిన వదిన.. ఎక్కడ?

పాము కరిచి మరిది చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు అన్నా వదినలు. అంతే వైద్యులు ఆంబులెన్స్ ఇవ్వలేదు. ఇక చేసేది లేక చంటి బిడ్డను వీపుకు కట్టుకుని.. మరోపక్క మరిది శవాన్ని భర్తతో కలసి మో

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (11:35 IST)
పాము కరిచి మరిది చనిపోయాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు అన్నా వదినలు. అంతే వైద్యులు ఆంబులెన్స్ ఇవ్వలేదు. ఇక చేసేది లేక చంటి బిడ్డను వీపుకు కట్టుకుని.. మరోపక్క మరిది శవాన్ని భర్తతో కలసి మోసేందుకు ఆ వదిన సిద్ధమైంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని ఛత్రా జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే... సిడ్పా గ్రామానికి చెందిన రాజేంద్ర ఒరాన్ అనే యువకుడిని ఓ పాము కరిచింది. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసి, ఆసుపత్రి ముందు ఆందోళన చేశారు. 
 
వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాజేంద్ర మృతి చెందాడని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే వైద్యులు శవాన్ని గ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ ఇచ్చేది లేదన్నారు. బతిమాలినా ప్రయోజనం లేకపోవడంతో మృతుడి అన్న, వదినలు తామే శవాన్ని మోశారు. స్థానికుల సాయంతో రాజేంద్ర శవం గ్రామానికి చేరింది. అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఇద్దరు అధికారులపై వేటు పడింది.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments