Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 'కరాచీ బేకరీ' రచ్చ ... పేర్లు మార్పించడం శివసేన వైఖరి కాదు

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (21:48 IST)
మహారాష్ట్రలో కరాచీ బేకరీ వివాదం చెలరేగింది. నిన్నామొన్నటి వరకు బాలీవుడ్ యువ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసు, ఆ తర్వాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదంతో ముంబై రాజకీయాలు అట్టుడుకిపోయాయి. ఇపుడు కరాచీ బేకరీ వివాదం తెరపైకి వచ్చింది. 
 
ఈ వివాదానికి గల కారణం పరిశీలిస్తే, ముంబైలో కరాచీ బేకరీ చాలా ప్రాముఖ్యతతో పాటు మంచి పేరుంది. గత 60 యేళ్లుగా ఇది ముంబై నగర వాసులకు సుపరిచితం. అయితే, కరాచీ బేకరీ పేరు మార్చాలని ఓ షాపు యజమానికి శివసేన నేత అల్టిమేటం ఇచ్చారు. ఇదే మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేసింది.
 
అసలు వివాదం ఏంటంటే.. నగరంలోని వెస్ట్ బాంద్రాలో ఉన్న కరాచీ బేకరీకి వచ్చిన శివసేనకు చెందిన నితిన్ నంద కిశోర్ అనే నేత.. కరాచీ పేరు మార్చాలంటూ షాపు యజమానికి అల్టిమేటం జారీ చేశారు. మార్చిన పేరు కూడా హిందీ, ఇంగ్లీషులో కాకుండా మరాఠీలో రాయాలని సూచించారు. దీంతో తీవ్ర భయానికి లోనైన షాపు యజమాని షాపు పేరుపై కవర్ కప్పేశాడు. 
 
'నువ్వు కరాచీ నుంచి వచ్చి ముంబైలో ఉంటున్నావు. నువ్వు ఏ మతాన్ని అయినా పాటించు, నాకు అభ్యంతరం లేదు. నువ్వు ముస్లిమైన కావొచ్చు, హిందువైనా కావొచ్చు. కానీ ముంబైలో ఉంటున్నావు. కానీ కరాచీ అనే పేరు పాకిస్థాన్‌ నుంచి వచ్చింది. దేశ విభజన అనంతరం మీరు ఇక్కడ బతుకున్నారు. ఇక్కడ ఉండండి, హాయిగా వ్యాపారాలు చేసుకోండి. కానీ ఆ పేరు మాత్రం తొలగించండి' అని షాపు యజమానితో నితిన్ అన్నారు. దీన్నంతిటినీ వీడియో తీసి తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశారు.
 
కాగా, దీనిపై విమర్శలు రావడంతో శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. 'కరాచీ బేకరీలు, కరాచీ స్వీట్లు, బిస్కెట్లు సుమారు 60 ఏళ్లుగా ముంబైలో ఉంటున్నాయి. కరాచీ అని ఉన్నంత మాత్రాన వారు పాకిస్థానీలు కాదు. ఇప్పుడు వారి షాపుల పేర్లు, స్వీట్ల పేర్లు మార్చాలని అడగడం పూర్తిగా అర్థం లేనిది. పేర్లు మార్చడం శివసేన వైఖరి కాదు' అని ఇంగ్లీషు, మరాఠీలో సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments