Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీపై కరోనా డెల్టా పంజా... 83.3 శాతం పాజిటివ్ రేటు

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (09:24 IST)
దేశ రాజధాని ఢిల్లీపై కరోనా డెల్టా వేరియంట్‌ పంజా విసిరింది. గత మూడు నెలల్లో ప్రభుత్వం పంపిన నమూనాల్లో అనేక మంది డెల్టా వేరియంట్‌ బారినపడినట్టు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌లో తేలింది. దాదాపు 80 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్‌గా గుర్తించారు. 
 
ఢిల్లీలో కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ ఒక సమావేశంలో ఆరోగ్యశాఖకు పలు వివరాలు తెలిపింది. ఢిల్లీలో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపిన 83.3 శాతం శాంపిల్స్‌లో డెల్టా వేరియంట్ (B.1.617.2) గుర్తించినట్లు పేర్కొంది.
 
మే నెలలో 81.7, జూన్‌ నెలలో 88.6, ఏప్రిల్‌ నెలలో 53.9 శాతం నమూనాల్లో డెల్టా వేరియంట్‌ బారినపడ్డట్లు తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌లో ఢిల్లీ నుంచి 5,752 శాంపిల్స్‌లో 1,689లో డెల్టా, 947 నమూనాలు ఆల్ఫా వేరియంట్‌ కేసులు రికార్డయ్యాయి. 
 
ఇకపోతే, ఢిల్లీలో రెండో దశ ఉధృతికి డెల్టా వేరియంట్‌ ప్రధాన కారణమని గుర్తించారు. లక్షలాది మంది జనం వేరియంట్‌ బారినపడగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆల్ఫా వేరియంట్‌ను గతేడాది యూకేలో కనుగొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments