Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడేళ్లు ప్రేమించాడు.. విడిపోదాం అన్నాడు.. అంతే యాసిడ్ పోసేసింది..

Webdunia
సోమవారం, 17 జూన్ 2019 (10:35 IST)
మహిళలపై అకృత్యాలు.. యాసిడ్ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. బైకు వెనకనే కూర్చుని ప్రియుడిపై ఓ యువతి యాసిడ్ పోసిన ఘటన ఢిల్లీలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. వారం రోజుల క్రితం బైక్ పై వెళుతున్న జంటపై యాసిడ్ దాడి జరుగగా, కేసును విచారించిన పోలీసులు, విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చారు. 
 
ఈ దాడికి యువకుడి వెనుక కూర్చున్న యువతే కారణమని తేల్చారు. యువతీ యువకులు గత మూడు సంవత్సరాలుగా ప్రేమలో ఉండగా, గత కొంతకాలంగా తనను వివాహం చేసుకోవాలని ఆమె అడుగుతూ ఉండటంతో యువకుడు నిరాకరిస్తూ వచ్చాడు. మనిద్దరమూ విడిపోదామని చెప్పసాగాడు. దీంతో అతని మాటలకు తట్టుకోలేకపోయిన ఆమె అతనిపై యాసిడ్ పోయాలని నిర్ణయించుకుంది. 
 
ఈ క్రమంలో 11వ తేదీన ఇద్దరూ బైక్ పై బయటకు వెళ్లారు. ముఖం సరిగ్గా కనిపించట్లేదని హెల్మెట్ తీసేలా చేసింది. అంతే ఆ సమయంలో తనతో తెచ్చుకున్న తెచ్చుకున్న యాసిడ్ ను అతనిపై చల్లింది. ఈ ఘటనలో అతనికి మెడ, గొంతు, ముఖంపై గాయాలు కాగా, యువతికి స్వల్ప గాయాలు అయ్యాయి. 
 
స్థానికుల సమాచారంతో ఇద్దరినీ ఆసుపత్రికి చేర్చి కేసు విచారణ ప్రారంభించిన పోలీసులకు ఒక్క క్లూ కూడా లభించలేదు. చివరికి ప్రియురాలే ప్రియుడిపై దాడి చేసిందని.. పెళ్లికి నో చెప్పడంతోనే అతనిపై యాసిడ్ చల్లానని వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments