Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై కూర్చుని మద్యం సేవించారా? ఆ ముగ్గురు?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (18:51 IST)
రైలు పట్టాలను దాటడమే ప్రమాదం, నేరమని రైల్వే శాఖ ఎన్ని ప్రకటనలు చేసినా.. పట్టాలు దాటడాన్ని ప్రయాణీకులు ఏమాత్రం విడిచిపెట్టట్లేదు. దీంతో రైలు ప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇటీవలే అమృత్ సర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమృతసర్ ప్రమాదం అనుకోకుండా జరిగింది. కానీ తాజా ఘటన మద్యం మత్తులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నంగ్లోయి రైల్వేస్టేషన్ సమీపంలో ఢిల్లీ-బికనీర్ మార్గంలో ముగ్గురు వ్యక్తులపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ సమయంలో రైల్వే పట్టాలపై మద్యం సేవిస్తూ ఉండడంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని డీసీపీ దినేష్ గుప్తా అనుమానిస్తున్నారు. 
 
లేకుంటే వారు మద్యం మత్తులో రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో ఇలా జరిగి ఉండవచ్చని చెప్తున్నారు. ప్రమాద సమయానికే ముగ్గురు వ్యక్తులు విపరీతమైన మద్యం మత్తులో ఉన్నారని డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments