Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై కూర్చుని మద్యం సేవించారా? ఆ ముగ్గురు?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (18:51 IST)
రైలు పట్టాలను దాటడమే ప్రమాదం, నేరమని రైల్వే శాఖ ఎన్ని ప్రకటనలు చేసినా.. పట్టాలు దాటడాన్ని ప్రయాణీకులు ఏమాత్రం విడిచిపెట్టట్లేదు. దీంతో రైలు ప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇటీవలే అమృత్ సర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమృతసర్ ప్రమాదం అనుకోకుండా జరిగింది. కానీ తాజా ఘటన మద్యం మత్తులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నంగ్లోయి రైల్వేస్టేషన్ సమీపంలో ఢిల్లీ-బికనీర్ మార్గంలో ముగ్గురు వ్యక్తులపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ సమయంలో రైల్వే పట్టాలపై మద్యం సేవిస్తూ ఉండడంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని డీసీపీ దినేష్ గుప్తా అనుమానిస్తున్నారు. 
 
లేకుంటే వారు మద్యం మత్తులో రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో ఇలా జరిగి ఉండవచ్చని చెప్తున్నారు. ప్రమాద సమయానికే ముగ్గురు వ్యక్తులు విపరీతమైన మద్యం మత్తులో ఉన్నారని డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments