Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు పట్టాలపై కూర్చుని మద్యం సేవించారా? ఆ ముగ్గురు?

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (18:51 IST)
రైలు పట్టాలను దాటడమే ప్రమాదం, నేరమని రైల్వే శాఖ ఎన్ని ప్రకటనలు చేసినా.. పట్టాలు దాటడాన్ని ప్రయాణీకులు ఏమాత్రం విడిచిపెట్టట్లేదు. దీంతో రైలు ప్రమాదాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఇటీవలే అమృత్ సర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన మరువకముందే మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అమృతసర్ ప్రమాదం అనుకోకుండా జరిగింది. కానీ తాజా ఘటన మద్యం మత్తులో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని నంగ్లోయి రైల్వేస్టేషన్ సమీపంలో ఢిల్లీ-బికనీర్ మార్గంలో ముగ్గురు వ్యక్తులపై నుంచి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రమాద సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ సమయంలో రైల్వే పట్టాలపై మద్యం సేవిస్తూ ఉండడంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని డీసీపీ దినేష్ గుప్తా అనుమానిస్తున్నారు. 
 
లేకుంటే వారు మద్యం మత్తులో రైల్వే పట్టాలు దాటుతున్న సమయంలో ఇలా జరిగి ఉండవచ్చని చెప్తున్నారు. ప్రమాద సమయానికే ముగ్గురు వ్యక్తులు విపరీతమైన మద్యం మత్తులో ఉన్నారని డీసీపీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments