Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం: 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం.. నిర్భయలా?

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (12:37 IST)
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దేశ రాజధానిలో అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోయింది. నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దానితో వదలకుండా క్రూరంగా ప్రవర్తించారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టారు. 
 
చావుబతుకుల మధ్య కొట్టాడుతున్న ఆ బాలుడిని అక్కడే వదిలేసి పరారయ్యారు. కొనఊపిరితో ఉన్న బాధితుడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆ బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడని వైద్యులు వెల్లడించారు.
 
ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్ స్వాతి మలివాల్‌ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో అమ్మాయిలకే కాదు.. కనీసం అబ్బాయిలకు కూడా భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టడంతో చావుబతులకు మధ్య ఆసుపత్రిలో ఉన్నాడని తెలిపారు. 
 
మహిళా ప్యానెల్ ఈ ఘటనను గుర్తించి పోలీసులతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించిందని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం