Webdunia - Bharat's app for daily news and videos

Install App

హస్తిన పీఠానికి కేజ్రీవాలే ముఖ్యమంత్రి ... పీపుల్స్ సర్వే

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (10:31 IST)
దేశ రాజధాని ఢిల్లీ. ఈ ఢిల్లీ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగన్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆప్‌తో పాటు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. ఈ ఎన్నికల ప్రచారం ఇప్పటికే ఊపందుకుంది. ముఖ్యంగా, ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో కమలనాథులు ఉన్నారు. ముఖ్యంగా, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌లు వ్యూహ రచనలు చేస్తున్నారు. 
 
కానీ, ఈ ఎన్నికల్లో వీరి వ్యూహాలు ఎంతమాత్రం పనిచేయబోవని హైదరాబాద్‌కు చెందిన పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ ఓ సర్వేలో తేల్చింది. కేజ్రీవాల్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఢిల్లీలోని పేదలు, మధ్య తరగతి ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, సగటున ఒక్కో కుటుంబం నెలకు రూ.1500 నుంచి రూ.3000 వేలకు ఆదా చేయగలుగుతోందని గుర్తుచేసింది. 
 
ఇకపోతే, ఢిల్లీలో విశ్వసనీయత గల నేత లేకపోవడం కూడా బీజేపీకి నష్టం చేసే అంశాల్లో ఒకటని సర్వే తెలిపింది. షీలాదీక్షిత్ మరణంతో కాంగ్రెస్ కోలుకోలేకపోతోందని, ఎన్నార్సీ, సీఏఏలు పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని స్పష్టం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకు పూర్తిగా ఆప్‌కు మారిందని సర్వే స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments