జనసేనతో ప్రయాణం ముగిసింది... ఇక రైతులతోనే... వీవీ లక్ష్మీనారాయణ (video)

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (09:59 IST)
జనసేనతో తాను సాగిస్తూ వచ్చిన ప్రయాణం ముగిసిందని, అంటే... ఇక అది ముగిసిన అధ్యాయం అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన రాజీనామా లేఖను ఆ పార్టీ ఆమోదించినందున దాని గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదన్నారు. ఇకనుంచి తన ప్రయాణమంతా రైతుల కోసం సాగుతుందన్నారు.
 
రైతుల సంక్షేమం కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించాలన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరతానన్న విషయం త్వరలోనే మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు మాత్రమే మార్గమని అభిప్రాయపడ్డారు.
 
ఈ సందర్భంగా ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. కేంద్ర బడ్జెట్ ప్రజా హితంగా ఉందని, పలు రంగాలకు కేటాయింపులు బాగున్నాయన్నారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. 
 
అనుబంధ బడ్జెట్‌లో ఏపీకి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీకి నిధుల కోసం ఎంపీలు ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

Varalakshmi : వరలక్ష్మి శరత్ కుమార్ నిర్మాతగా దోస డైరీస్ బేనర్ లో సరస్వతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments