Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనతో ప్రయాణం ముగిసింది... ఇక రైతులతోనే... వీవీ లక్ష్మీనారాయణ (video)

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (09:59 IST)
జనసేనతో తాను సాగిస్తూ వచ్చిన ప్రయాణం ముగిసిందని, అంటే... ఇక అది ముగిసిన అధ్యాయం అని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. జనసేన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన రాజీనామా లేఖను ఆ పార్టీ ఆమోదించినందున దాని గురించి వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదన్నారు. ఇకనుంచి తన ప్రయాణమంతా రైతుల కోసం సాగుతుందన్నారు.
 
రైతుల సంక్షేమం కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించాలన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరతానన్న విషయం త్వరలోనే మీడియాకు వెల్లడిస్తానని చెప్పారు. ప్రజాసేవ చేయడానికి రాజకీయాలు మాత్రమే మార్గమని అభిప్రాయపడ్డారు.
 
ఈ సందర్భంగా ఆయన కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. కేంద్ర బడ్జెట్ ప్రజా హితంగా ఉందని, పలు రంగాలకు కేటాయింపులు బాగున్నాయన్నారు. యువతరాన్ని వ్యవసాయం వైపు మళ్లించేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. 
 
అనుబంధ బడ్జెట్‌లో ఏపీకి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఏపీకి నిధుల కోసం ఎంపీలు ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments