Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 12న ఢిల్లీ రోడ్లు దిగ్బంధం

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (07:43 IST)
వివాదస్పద వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా ఇచ్చిన ప్రతిపాదనను రైతులు ఏకగ్రీవంగా తిరస్కరించడమే కాకుండా డిసెంబర్ 14న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా డిసెంబర్ 12 ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బంధిస్తామని సింఘూ సరిహద్దు రైతులు ప్రకటించారు. 
 
కేంద్రం ప్రతిపాదనలు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని, తమ డిమాండ్లను తూచా తప్పకుండా కేంద్రం ప్రభుత్వం ఆమోదించే వరకు వెనక్కి తగ్గేది లేదని వారు పేర్కొన్నారు.
 
రైతు ఉత్పత్తుల సేకరణకు ప్రస్తుతం అమలులో ఉన్న కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) విధానం కొనసాగుతుందని, ఈ మేరకు లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ ప్రతిపాదనలో కేంద్రం పేర్కొంది.

అయితే వ్యవసాయ చట్టాలు రద్దు చేయడం మినహా మరే ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని రైతులు మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదనను అన్ని రైతు సంఘాలు కలిసి ఏకగ్రీవంగా తిరస్కరించాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments