Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయం: కాలవ శ్రీనివాసులు

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (07:39 IST)
రాష్ట్రంలో అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టులకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం అన్యాయమని మాజీ మంత్రి, టి.డి.పి పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

పాత్రికేయులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేసే కమిటీల్లో జర్నలిస్టు సంఘాల  భాగస్వామ్యం దశాబ్దాల కాలంగా ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే వారి ప్రాతినిధ్యం లేకుండా కేవలం అధికారులతో కమిటీలను ఏర్పాటు చేస్తూ మంగళవారం 123 వ నెంబర్ జి.ఓ ను జారీ చేయడం పాత్రికేయుల హక్కులను కాలరాయడమేనని ఆయన విమర్శించారు.

స్వయంగా ఓ మీడియా సంస్థ అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వం పూర్వాశ్రమoలో జర్నలిస్టుగా పని చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణా రెడ్డి పర్యవేక్షణలో పాత్రికేయులపై పగబట్టినట్లు వ్యవహరిస్తుండడం దారుణమని దుయ్యబట్టారు.

చంద్రబాబు నాయుడి హయాంలో అక్రిడేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యాన్ని  ఒకటి నుంచి అయిదుకు పెంచామన్నారు. ప్రస్తుతం జర్నలిస్టుల్లేని అక్రిడేషన్ కమిటీల్లో పాత్రికేయుల స్థితిగతులను ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు.

జర్నలిస్టుల ప్రయోజనాలను దెబ్బ తీసే జి.ఓ 123 ను తక్షణం ఉపసంహరించడంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన పాత కమిటీల జర్నలిస్టుల ప్రాతినిధ్యాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా మదరాసి టైటిల్ గ్లింప్స్

సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు అప్రిషియేషన్స్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments