Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ల చిన్నారిపై దాడి.. 20 ఏళ్ల జైలు శిక్ష.. నాంపల్లి కోర్టు

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2020 (07:37 IST)
నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. లైంగిక దాడికి పాల్పడిన కామాంధుడికి 20 ఏళ్ల జైలుశిక్ష పడింది. జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండేండ్ల క్రితం చోటు చేసుకున్న సంఘటనపై బుధవారం నాంపల్లిలోని ఒకటవ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి సునీత కుంచాల ఈ మేరకు తీర్పును వెలువరించారు.

వివరాల్లోకి వెళితే... అసిఫ్‌నగర్‌కు చెందిన ఓ మహిళ తన నాలుగేళ్ల కూతురుతో కలిసి 2018 మే 27న రహ్మత్‌నగర్‌ సమీపంలోని బ్రహ్మశంకర్‌నగర్‌లోని పుట్టింటికి వచ్చింది. పక్కనే ఉన్న కిరాణాషాపునకు వెళ్లి షాంపు తీసుకురావాలని చిన్నారిని తల్లి పంపించింది. 
 
షాపునకు వెళ్లివస్తున్న చిన్నారిని గమనించిన డిప్పు కుమార్‌ శ్రీవాత్సవ్‌ అలియాస్‌ దీపు(22) చాక్లెట్‌ ఇస్తానంటూ తనగదిలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కాసేపటికి చిన్నారిని వెతుక్కుంటూ వచ్చిన కుటుంబ సభ్యులు దీపు గదిలోకి వెళ్లి చూడగా జరిగిన విషయం తెలిసింది. వారిని చూసిన డిప్పు కుమార్‌ అక్కడినుంచి పారిపోయాడు. 
 
ఈ మేరకు చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు అత్యాచారం, కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు. కేసులో పక్కా ఆధారాలు సమర్పించడంతో బుధవారం డిప్పు కుమార్‌కు 20ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానా విధించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం