Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన ఎమ్మెల్యే కాదు.. ఓ రేపిస్ట్ : దోషిగా బీజేపీ నేత నిర్ధారణ

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (10:50 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఆయన్ను ఓ రేపిస్ట్‌గా కోర్టు అభివర్ణించింది. సమాజంలో పలుకుబడిగల వ్యక్తి (ఎమ్మెల్యే)కి వ్యతిరేకంగా పోరాడేందుకు బాధితురాలు కొంత సమయం తీసుకున్నదని, ఆమె ఇచ్చిన వాంగ్మూలం సత్యమైనదని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
పైగా, ఈ కేసు విచారణలో కూడా సీబీఐ అధికారులు తీవ్రమైన ఒత్తిడి కారణంగా అనేక నిబంధనలను యధేచ్చగా ఉల్లింఘించారంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. ముఖ్యంగా, ఈ కేసులో చార్జిషీటు దాఖలులో జాప్యం చేయడం, దర్యాప్తు సమయంలో అధికారి లేకపోవడంపై కోర్టు విస్మయం వ్యక్తంచేసింది. 
 
పోక్సో చట్టంలో లోపంలేదని, అధికారుల అసమర్థత, అమానవీయ దృక్పథం వల్లనే బాధితులకు న్యాయం ఆలస్యంగా అందుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో మరో నిందితుడు శశిసింగ్‌ను నిర్దోషిగా విడుదల చేసిన కోర్టు.. దోషిగా ఖరారైన కుల్దీప్ సెంగార్‌కు విధించాల్సిన శిక్షపై బుధవారం విచారణ జరుపనుంది. ఉన్నావ్ లైంగికదాడి కేసుతో సంబంధమున్న మరో నాలుగు కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments