Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయన ఎమ్మెల్యే కాదు.. ఓ రేపిస్ట్ : దోషిగా బీజేపీ నేత నిర్ధారణ

Webdunia
మంగళవారం, 17 డిశెంబరు 2019 (10:50 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో అత్యాచార కేసులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఆయన్ను ఓ రేపిస్ట్‌గా కోర్టు అభివర్ణించింది. సమాజంలో పలుకుబడిగల వ్యక్తి (ఎమ్మెల్యే)కి వ్యతిరేకంగా పోరాడేందుకు బాధితురాలు కొంత సమయం తీసుకున్నదని, ఆమె ఇచ్చిన వాంగ్మూలం సత్యమైనదని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
పైగా, ఈ కేసు విచారణలో కూడా సీబీఐ అధికారులు తీవ్రమైన ఒత్తిడి కారణంగా అనేక నిబంధనలను యధేచ్చగా ఉల్లింఘించారంటూ న్యాయమూర్తి మండిపడ్డారు. ముఖ్యంగా, ఈ కేసులో చార్జిషీటు దాఖలులో జాప్యం చేయడం, దర్యాప్తు సమయంలో అధికారి లేకపోవడంపై కోర్టు విస్మయం వ్యక్తంచేసింది. 
 
పోక్సో చట్టంలో లోపంలేదని, అధికారుల అసమర్థత, అమానవీయ దృక్పథం వల్లనే బాధితులకు న్యాయం ఆలస్యంగా అందుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో మరో నిందితుడు శశిసింగ్‌ను నిర్దోషిగా విడుదల చేసిన కోర్టు.. దోషిగా ఖరారైన కుల్దీప్ సెంగార్‌కు విధించాల్సిన శిక్షపై బుధవారం విచారణ జరుపనుంది. ఉన్నావ్ లైంగికదాడి కేసుతో సంబంధమున్న మరో నాలుగు కేసుల విచారణ ఇంకా కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments