Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నాపర్లుగా ఖాకీలు.. దొంగను కిడ్నాప్ చేసి రూ.3 లక్షల డిమాండ్

Webdunia
బుధవారం, 26 మే 2021 (19:47 IST)
సమాజంలో నేరాలు ఘోరాలు జరుగకుండా పహారా కాస్తూ, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కిడ్నాపర్లుగా మారిపోయారు. వారంతా ఓ దొంగను కిడ్నాప్ చేశారు. ఆ దొంగను వదిలిపెట్టేందుకు ఏకంగా రూ.3 లక్షలను డిమాండ్ చేశారు. డబ్బు సంపాదన ఆశలో పడి ఈ నేరానికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని జామియా నగర్ పోలీస్ స్టేషనులో దారి దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతడిని విడిపించిన పోలీసులు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. 
 
అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏకంగా ఓ కిడ్నాప్‌కు ప్లాన్ చేశారు. తాము రక్షించిన దొంగను కిడ్నాప్ చేసి.. అతడిని పోలీస్ స్టేషన్‌లోనే దాచి పెట్టారు. అతడిని విడిచిపెట్టాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
 
ఈ కిడ్నాప్ ఉదతంపై దొంగ కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగను పోలీస్ స్టేషనులోనే దాచిపెట్టినట్టు గుర్తించారు. ఈ కేసులో రాకేష్ కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు ఇందులో కీలక నిందితులుగా ఉన్నారు. దీనిపై దీంతో వారు ముగ్గురినీ విధుల నుంచి తొలిగించారు. అలాగే, వారిని అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments