Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నాపర్లుగా ఖాకీలు.. దొంగను కిడ్నాప్ చేసి రూ.3 లక్షల డిమాండ్

Webdunia
బుధవారం, 26 మే 2021 (19:47 IST)
సమాజంలో నేరాలు ఘోరాలు జరుగకుండా పహారా కాస్తూ, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కిడ్నాపర్లుగా మారిపోయారు. వారంతా ఓ దొంగను కిడ్నాప్ చేశారు. ఆ దొంగను వదిలిపెట్టేందుకు ఏకంగా రూ.3 లక్షలను డిమాండ్ చేశారు. డబ్బు సంపాదన ఆశలో పడి ఈ నేరానికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని జామియా నగర్ పోలీస్ స్టేషనులో దారి దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతడిని విడిపించిన పోలీసులు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. 
 
అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏకంగా ఓ కిడ్నాప్‌కు ప్లాన్ చేశారు. తాము రక్షించిన దొంగను కిడ్నాప్ చేసి.. అతడిని పోలీస్ స్టేషన్‌లోనే దాచి పెట్టారు. అతడిని విడిచిపెట్టాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
 
ఈ కిడ్నాప్ ఉదతంపై దొంగ కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగను పోలీస్ స్టేషనులోనే దాచిపెట్టినట్టు గుర్తించారు. ఈ కేసులో రాకేష్ కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు ఇందులో కీలక నిందితులుగా ఉన్నారు. దీనిపై దీంతో వారు ముగ్గురినీ విధుల నుంచి తొలిగించారు. అలాగే, వారిని అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

'సిరివెన్నెల'కు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments