Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నాపర్లుగా ఖాకీలు.. దొంగను కిడ్నాప్ చేసి రూ.3 లక్షల డిమాండ్

Webdunia
బుధవారం, 26 మే 2021 (19:47 IST)
సమాజంలో నేరాలు ఘోరాలు జరుగకుండా పహారా కాస్తూ, ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కిడ్నాపర్లుగా మారిపోయారు. వారంతా ఓ దొంగను కిడ్నాప్ చేశారు. ఆ దొంగను వదిలిపెట్టేందుకు ఏకంగా రూ.3 లక్షలను డిమాండ్ చేశారు. డబ్బు సంపాదన ఆశలో పడి ఈ నేరానికి పాల్పడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని జామియా నగర్ పోలీస్ స్టేషనులో దారి దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అతడిని విడిపించిన పోలీసులు ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. 
 
అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏకంగా ఓ కిడ్నాప్‌కు ప్లాన్ చేశారు. తాము రక్షించిన దొంగను కిడ్నాప్ చేసి.. అతడిని పోలీస్ స్టేషన్‌లోనే దాచి పెట్టారు. అతడిని విడిచిపెట్టాలంటే రూ.3 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
 
ఈ కిడ్నాప్ ఉదతంపై దొంగ కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ విచారణలో దొంగను పోలీస్ స్టేషనులోనే దాచిపెట్టినట్టు గుర్తించారు. ఈ కేసులో రాకేష్ కుమార్ అనే హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు ఇందులో కీలక నిందితులుగా ఉన్నారు. దీనిపై దీంతో వారు ముగ్గురినీ విధుల నుంచి తొలిగించారు. అలాగే, వారిని అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments